India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్, శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడకూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలన్నారు.
జూన్ 4న నిర్వహించనున్న ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం ఆయన HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సూర్యాపేట మండలం కాసరబాద్ గ్రామానికి చెందిన నరేష్(27) సూర్యాపేటలో మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి నరేష్ మానసిక పరిస్థితి బాగా లేక చనిపోతున్నానంటూ పదేపదే తల్లిదండ్రులు చెప్పేవాడు. మంగళవారం కట్టంగూరు మండలం అయిటిపాములలోని 133కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి సూసైడ్ చేసుకున్నాడు. మృతుని తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శీను తెలిపారు.
గుడిపల్లి మండలం గణపురం గ్రామ శివారులోని పెద్దమ్మతల్లి దేవాలయంలో నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకులను గణపురం శివారు పెద్దమ్మతల్లి దేవాలయంలో దాచి ఉంచినట్లు దేవాలయ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తుపాకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నర్సింహులు తెలిపారు.
యాదాద్రి జిల్లాలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంత్ ఆదేశించారు. వచ్చే జూన్ 3 నుంచి 11 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయానుకూలంగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ASI బలరాం రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆత్కూరి అనంతరావమ్మ భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఇటీవల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనోవేదనకు గురై అనంతరావమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెల్లెలు రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. యాదగిరిపల్లి కాలనీకి చెందిన కోటేశ్వర్రావు, బాలమణి దంపతుల కుమార్తె సౌమ్య(24) 2022లో అమెరికాకు వెళ్లి 4 నెలల క్రితం ఫోరిడాలోని అట్లాంటిక్ యూనివర్శిటీలో MS పూర్తి చేసింది. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న సౌమ్య ఆదివారం మార్కెట్కి వెళ్లి వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందింది.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ 4 గంటలకు ముగియగా మొత్తం 68.65% పోలింగ్ నమోదయింది. సిద్దిపేట-69.82, జనగాం71. 60, హనుమకొండ– 71.21,వరంగల్-70.84, మహబూబాబాద్-69.52, ములుగు-74.54, భూపాలపల్లి-69.16, భద్రాద్రి,-68.05, ఖమ్మం-65.54, భువనగిరి-67. 45,సూర్యాపేట-70.62, నల్లగొండ-66.75 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 4,63,838 ఓట్లకు గాను 3,18,445 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని 67 మోటార్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా TG, APల్లో బైకుల దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని తెలిపారు.
నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 606 పోలింగ్ కేంద్రాలలో 4,63,839 ఓట్లు ఉండగా ఇప్పటివరకు 2,29,762 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు పెద్దసంఖ్యలో బారులు తీరారు.
Sorry, no posts matched your criteria.