India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2021లో KMM-NLG-WGL పట్టభద్రుల MLC ఎన్నికలో రెండో ప్రాధాన్య ఓట్లతోనే అప్పటి BRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. మొత్తం 5,05,565 ఓట్లకు గానూ 3,87,960 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 21,636ఓట్లు చెల్లలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్యతా ఓట్లను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులపాటు జరిగిన లెక్కింపు అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. రేపు ఈస్థానంలో ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.
బకెట్లో పడి బాలుడు మృతిచెందిన ఘటన హుజూర్నగర్లో శనివారం జరిగింది. మోడల్ కాలనీలో సతీ సంతోష్సింగ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. కుమారుడు రాజ్కుమార్సింగ్(2) శనివారం ఆడుకుంటూ వెళ్లి బాత్రూంలో ఉన్న నీటి బకెట్లో పడిపోయాడు. కొంతసేపటికి గమనించిన తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
NLG- KMM -WGL ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికు సిరా గుర్తు పెట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం సరఫరా చేసిన స్కెచ్ ద్వారా మాత్రమే ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఫొటో తీస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
వరంగల్- ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న 12 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీశ్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్పై కూర్చున్న రితీశ్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.
WGL-KMM-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. పోలింగ్ ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. ఏడుగురు మంత్రులు ఈ నియోజకవర్గంలో ఉండగా.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిటింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. బీజేపీ ఈ స్థానంలో బోణీ కొట్టాలని చూస్తోంది.
ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా NLG- KMM -WGL శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై పలు సూచనలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి సన్నరకం ధాన్యం పండించిన రైతులకు మాత్రమే క్వింటాకు రూ. 500 బోనస్ సెల్ ఇస్తామని ప్రకటించింది. కానీ దొడ్డు రకం వడ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేయాలా లేదా దొడ్డు రకం వరి సాగు చేయాలా అని అయోమయంలో ఉమ్మడి జిల్లాలోని రైతులు పడిపోయారు.
ఈనెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం ఉంటుందని కలెక్టర్, పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.