India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా HYDలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు. ఆ అధికారి సహకారంతో మైనర్ను నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. పోలీసులు నిమ్స్కు చేరుకుని బాలికను NLGకు తరలించినట్టు సమాచారం.
NLG-KMM-WGL పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. 27న పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్య నేతలంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులతోపాటు స్థానిక నేతలతో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్రులు బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలపై ఎఫెక్ట్ పడనుంది.
ఎన్నికల హడావుడి ముగియగానే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ సామాజికవర్గ నేత, సీఎం రేవంత్ రెడ్డి వర్గం కావడంతో ఆయనకు మినిస్టర్ పోస్ట్ దక్కే అవకాశం ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి, ఉత్తమ్ మంత్రివర్గంలో ఉండటం తెలిసిందే.
చింత చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హుస్సేన్ గ్రామంలోని చెరువు కట్ట సమీపంలో ఉన్న చింత చెట్టు ఎక్కి చిగురు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య షాజిదా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిన నల్లగొండలోని ఎస్పీ ఆర్ పాఠశాల సెంటర్లో నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2024 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు కొనసాగాయి. ఈ పరీక్షలకు 360 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 331 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
కుమారుడు కొట్టాడని తల్లి ఉరి వేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. మోత్కూరుకు చెందిన రేఖ(38)కు కూతరు(15), కుమారుడు(17) సంతానం. కుమారుడు HYDలోని కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నాడు. ఇంటర్లో ఫెయిల్ అవడంతో చెడు వ్యసనాలు మాని బాగా చదువుకోవాలని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో కుమారుడు కోపోద్రేకుడై తల్లిపై చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో మొత్తం 12,000 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1న పరీక్షలు ముగియనున్నాయి.
NLG -KMM- WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడం నిషేధమని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఈ ఉపఎన్నికకు ఈనెల 27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
MLC ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ రోజు విధులు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఉద్యోగులు కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ వెంకట్రావు,ఆదనపు కలెక్టర్ ప్రియాంకతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 182 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని తెలిపారు. రేపే చివరి రోజు అని తెలిపారు.
సర్వేలను తలదన్నేలా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఈటల రాజేందర్ అన్నారు. నేడు దేవరకొండలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా.. కానీ అంతా ఉత్తదే, పదేళ్లలో మోదీ ప్రభుత్వంపై ఒక్క స్కామ్ ఆరోపణరాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలతో ఛీకొట్టించుకుంది’ అని అన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.