Nalgonda

News May 2, 2024

NLG: నామినేషన్ల స్వీకరణకు.. ఏర్పాట్లు పూర్తి..

image

పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్ల స్వీకరణకు నల్లగొండ కలెక్టరేట్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ పత్రాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో 4,61,806 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 12 కొత్త జిల్లాల పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News May 1, 2024

NLG: జానారెడ్డి అదృష్ట వంతుడు: కోమటిరెడ్డి

image

ప్రధాని మోదీ తమ లెక్కలోనే లేరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జానారెడ్డి అదృష్ట వంతుడని.. ఒక కొడుకు ఎమ్మెల్యే.. మరో కొడుకు భారీ మెజార్టీతో ఎంపీగా గెలువబోతున్నారని జోస్యం చెప్పారు.

News May 1, 2024

NLG: రాజకీయ పార్టీలకు ఎస్పీ కీలక సూచన

image

పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలలో తప్పనిసరిగా ప్రవర్తన నియమావళి ప్రకారం ముద్రించాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల ప్రచార కరపత్రాలలో ప్రచురణకర్త పేరు, చిరునామా, ప్రింటర్ పేరు ఉండాలని,ఈ కరపత్రాలు ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదన్నారు. అంతేకాక ఏదైనా కులం, మతానికి అనుకూలంగా కానీ, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు లేకుండా నియమ నిబంధనలను పాటిస్తూ ప్రచురించాలని తెలిపారు.

News May 1, 2024

రుణమాఫీ చేయకపోతే మళ్లీ మీ ముందుకు రాము: కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలో నల్గొండ అసెంబ్లీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే భవిష్యత్తులో మీ ముందుకు రామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తే పదేళ్ల కేసీఆర్ పాలనలో మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.

News May 1, 2024

‘జీతాలు లేక రెండు నెలలు.. ఇబ్బందుల్లో అంగన్వాడీలు’

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు జీతాల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు జీతాలు చెల్లించలేదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్లో 24 రోజులు సమ్మె చేశామని.. ఆ కాలానికి సంబంధించిన వేతనాలు కాంగ్రెస్ చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.

News May 1, 2024

ఉమ్మడి నల్గొండలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం యాదగిరిగుట్ట, వలిగొండ, మునగాల, చండూరులో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త అవసరం.

News May 1, 2024

NLG: రేపటి నుంచి శిక్షణ షురూ: కలెక్టర్

image

నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల కోసం నియమించిన సిబ్బందికి ఈ నెల 2 నుంచి 4 వరకు శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు.

News May 1, 2024

భువనగిరిలో త్రిముఖ పోరు..!

image

నిన్న మొన్నటి వరకు భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి మల్లేశ్, కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్, BJP బూర నర్సయ్య గౌడ్ మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

News May 1, 2024

నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

image

నల్లగొండ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాంపల్లి మండల కేంద్రంలో 45.9 డిగ్రీలు, చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం జిల్లా అంతటా 41.1 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడం, ఉక్కపోత కారణంగా జనం తల్లడిల్లుతున్నారు.

News May 1, 2024

6785 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు

image

జిల్లాలోని 466061 ఆహార భద్రతా కార్డులకు సంబంధించి మే నెలకు 6785.396 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు డీఎస్వో వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డుదారులు చౌకధర దుకాణాలకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి లబ్దిదారునికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారునికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారునికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.