India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతులకు రెండు నెలలపాటు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతులు మే 1న గ్రామీణ సంస్థకు ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలన్నారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వారం రోజుల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మునగాల వద్ద జరిగిన యాక్సిడెంట్ మరువక ముందే ఇవాళ కోదాడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్లపై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
దేవరకొండకి చెందిన అజీజ్ అత్యంత ఎత్తైన (11,649 ఫీట్ల) ప్రదేశం”జోజి లా పాస్ “కు చేరుకున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుంచి బైక్పై ఆరు రోజుల్లో అక్కడికి వెళ్లిన అజీజ్ పర్వతాన్ని అధిరోహించాడు. అజీజ్ను పలువురు ప్రశంసిస్తున్నారు.
సూర్యాపేట నుంచి భువనగిరిలో జరిగే పోరుబాట కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. బుధవారం పోరు బాట అనంతరం సూర్యాపేటలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో బస చేసిన సంగతి తెలిసిందే. సూర్యాపేట నుంచి అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా ఆయన భువనగిరికి చేరుకోనున్నారు.
రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సొసైటి ఆధ్వర్యంలో నడపబడుచున్న 23 పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 28న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ కే.లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు onlineలో ఆప్లై చేసిన విద్యార్ధులు https://telanganaexmes.egg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కలెక్టర్ హరి చందన దాసరి సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు స్వయంగా రాసి, రికార్డు చేసిన పాటల సీడీని కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తాగునీరు, ఓఆర్ఎస్ తో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
నల్లగొండలో నామినేషన్ల జోరు కొనసాగుతుంది. చివరి రోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, MPCPI(U) పార్టీ అభ్యర్థిగా వసుకుల మట్టయ్య, బీఎస్పి పార్టీ అభ్యర్థిగా విరిగినేని అంజయ్య, సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా సుభద్రారెడ్డి , స్వతంత్ర అభ్యర్థులుగా పానుబోతు లాల్ సింగ్ నాయక్, తిరుగుడు రవికుమార్ తమ నామినేషన్లను దాఖలు చేశారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.28,72,11,468గా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.5.2,59,650, భార్య చేతిలో రూ. 5.1,06,750 నగదు ఉన్నట్లు చూపించారు. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ.19,47,81,000, చరాస్తులు రూ.9,24,30,468.. కాగా భార్యాభర్తల పేరున ఉన్న మొత్తం అప్పులు రూ.73,48,373గా చూపారు.
ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని అన్నారు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.28,72,11,468గా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.5.2,59,650, భార్య చేతిలో రూ. 5.1,06,750 నగదు ఉన్నట్లు చూపించారు. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ.19,47,81,000, చరాస్తులు రూ.9,24,30,468.. కాగా భార్యాభర్తల పేరున ఉన్న మొత్తం అప్పులు రూ.73,48,373గా చూపారు.
Sorry, no posts matched your criteria.