India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్ నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎర్రగట్టు వద్ద జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు 12 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారు.
జాతీయ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈనెల 21న మునగాల మండలం ముకుందాపురం ప్రమాదంలో దంపతులు, గురువారం కోదాడ పరిధిలోని శ్రీరంగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి మెత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 51 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరి చందన తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లాఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్యవంశీ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా?ఏవైనా సమస్యలు ఉన్నాయా?ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటిస్తున్నారా?అని అడిగి తెలుసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువతకు 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని NLG బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. MLG నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెంలో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి, సాధినేని శ్రీనివాసరావు, రంజిత్ యాదవ్, చల్లా శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రాయిపల్లికి చెందిన బోడ నరేష్ ఆయన కుమారుడు సాయికుమార్తో కలిసి మోటకొండూరు మండలంలోని చాడ గ్రామం బంధువుల ఇంట్లో ఎల్లమ్మ పండుగకు వెళ్లారు. పండుగ అనంతరం పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి నరేష్, సాయికుమార్, మృతి చెందారు.
నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తున్న బోడ ఆశ్రిత వడదెబ్బతో మృతి చెందింది. గత నాలుగు రోజులుగా అడ్మిషన్స్ కోసం ఎండలో క్యాంపెయిన్ చేస్తూ అస్వస్థకు గురై.. మృతి చెందింది. ఈ ఘటనతో అమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎండ తీవ్రతకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
JEE మెయిన్స్ ఫలితాల్లో నల్గొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాలకు చెందిన దేశిరెడ్డి వినీల (33.10), శాగంటి సిరి (55.10), రుద్రారపు శ్రావ్య (64.41) వల్కి అక్షిత (28.05), అనంతుల శృతి (27.17) అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ షాహిన్ షేక్, అధ్యాపకులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.