India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. తొలి రోజు కొత్త చట్టాల కింద జిల్లాలో ఏడు ఎఫ్ఐఆర్లను నమోదయ్యాయని తెలిపారు. బాధితుడు ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాలలో బుధ, గురువారాలు రెండు రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఈ విషయమై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సమయపాలన పాటించాలని ఆదేశించారు.

<<13545889>>మంత్రి కోమటిరెడ్డికి <<>>మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బీఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండలో రూ.100 కోట్లు పలికే భూమి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మిగతా పార్టీ ఆఫీసులకు భూమి కేటాయించినట్లే బీఆర్ఎస్కి భూ కేటాయింపు జరిగిందన్నారు. పార్టీ ఆఫీసుకు సీసీఎల్ఏ అనుమతులు కూడా వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం డబ్బు కూడా చెల్లించామన్నారు.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టంలో తొలి కేసు సోమవారం నల్లగొండ వన్ టౌన్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఏబీవీపీ నాయకులు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ధర్నా చేయడంతో నూతన చట్టం 151 ప్రకారం కేసు నమోదు చేశారు. 151 నూతన చట్టం ప్రకారం వ్యక్తిగత పూచికత్తుపై వదిలి పెట్టినప్పటికీ సెక్షన్ మార్పు మినహా వ్యక్తి గత పూచికత్తుపై వదిలేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆసుపత్రులకు రోగులు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో ప్రజలు విలవిలాడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, గ్రామీణులు కోరుతున్నారు.

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు వివరాలు.. NLGజిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన వాసి వంశీకృష్ణ(19) HYDలో ఉంటూ మెకానిక్గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2రోజులు రూమ్లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RRజిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

భారత ప్రభుత్వం నూతన న్యాయ చట్టాలు 2023 సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

తల్లిగారింట్లో పుట్టినరోజు చేసుకోవాలని వచ్చిన వివాహిత అదేరోజు కరెంట్ షాక్తో మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం.. రాజపేట మండలం పారుపల్లి వాసి భూపతి సురేశ్, బాలాంజలి దంపతులు. సోమవారం బర్త్ డే సందర్భంగా పిల్లలు, భర్తతో కలిసి గౌరాయిపల్లికి వచ్చింది. బట్టలు ఉతుకుతుండగా కరెంట్ షాక్కు గురైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.