India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం NLG పార్లమెంటు స్థానానికి 22 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. BRS తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు, బీజేపీ తరఫున నూకల నరసింహారెడ్డి 2 సెట్లు, BJP అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓ సెట్, కాంగ్రెస్ తరపున రఘువీర్ కుందూరు 3 సెట్లు, కుందూరు జానారెడ్డి 2 సెట్లు, డీఎస్పీ తరఫున తలారి రాంబాబు ఓ సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.
BRS NLG ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. తన పేరుపై రూ.82.6కోట్ల స్థిరాస్తులు, చరాస్తులు ఉన్నాయన్నారు. తన భార్య పేరిట రూ.1.6 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. తన వద్ద రూ.88వేలు, భార్య వద్ద రూ.18,600 ఉన్నాయన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.96లక్షల డిపాజిట్లు ఉన్నట్లు చూపారు. భార్య పేరున 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నాయన్నారు.
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గణపురం స్టేజీ వద్ద మెట్రో వాటర్ దిమ్మెను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నల్గొండలోని గాంధీనగర్కు చెందిన గండమళ్ల సన్హిత్ దేవ్ సత్తా చాటాడు. శ్రీను ప్రసన్న దంపతులకు చెందిన సన్హిత్ ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. దీంతో సన్హిత్కు బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
సెకండియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 68.45 శాతంతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. 11,474 మందికి 7854 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లా 62.74 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. 6,063 మందికి 3804 మంది పాసయ్యారు. యాదాద్రి భువనగిరి 62.64 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 4446 మందికి 2785 మంది పాసయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 57.2 శాతంతో రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. 11,555 మందికి 6,610 మంది పాసయ్యారు. యాద్రాద్రి భువనగిరి 51.04 శాతంతో 26వ స్థానంలో నిలిచింది. 4,561 మందికి 2,328 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లాలో 49.42 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 6,637 మందికి 3,280 మంది పాసయ్యారు.
నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. NLG జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 32,895 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 16,602 మంది విదార్థులు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 12,559 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్ను WAY2NEWS యాప్లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ MGU రిజిస్ట్రార్ అల్వాల రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం, ఇతర అడ్మినిస్ట్రేషన్ విభాగాలు యథావిధిగా పని చేస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ సీఎం KCR తన బస్సు యాత్రను నల్గొండ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోల్లో KCR పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో పాల్గొనున్నారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.
మిర్యాలగూడ పట్టణంలో వీరహనుమాన్ శోభాయాత్రను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభయాత్ర కాషాయ జెండాలు చేతపట్టి భక్తులు భారీ ఆంజనేయ విగ్రహంతో పట్టణంలో డిజే భక్తి గీతాల మధ్య నృత్యాలు, కోలాటాలు ఆడుతూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్, రేపాల పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.