India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో గురువారం జరిగిన రోడ్డు <<13120144>>ప్రమాదంలో <<>>తల్లిదండ్రులతో పాటు, నాయనమ్మ, తాతయ్యని కోల్పోయి కార్తీక్, కౌశిక్లు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, ఇద్దరు అన్నదమ్ములు స్వల్ప గాయాలతో మృత్యుంజయులుగా బయటపడ్డారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేడ జంగాల కాలనీలో గురువారం ఇద్దరు ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ముత్యాలు భార్య కనకలక్ష్మి(35), పులేందర్(40) రాజాపేటలోని పులేందర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒకే చీరతో ఉరేసుకున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భువనగిరి జిల్లా నారాయణపూర్(M) శేరిగూడెంకి చెందిన మహేశ్ కుమార్ ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించాడు. మొదట కానిస్టేబుల్ ఉద్యోగం చేసిన అతనికి, SSC జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. అటువైపు జాబ్ చేస్తూ చదువుతూ ముందుకు వెళ్లాడు. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4 ఉద్యోగం సాధించాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాల్లో ఏకంగా రాష్ట్రంలోనే ఐదవ ర్యాంకు సాధించాడు.
కన్నబిడ్డకు పాలిస్తూ.. గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన రఘునాథపల్లి(M) శివాయిగూడెంలో చోటుచేసుకుంది. డాక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భవాని(25) ఫిబ్రవరి 12న పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టింటికి నిద్ర చేసేందుకు వచ్చింది. ఈక్రమంలో బిడ్డకు పాలిస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీకుసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి రోజు 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందనకు సమర్పించారు. ప్రధాన పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తం 56 మంది 114 నామినేషన్ సెట్లను సమర్పించారు. వీటిని శుక్రవారం పరిశీలించనున్నారు.
నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వడగాడ్పులు వీస్తుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం జిల్లాలోనే అత్యధికంగా నిడమనూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా అత్యల్పంగా చింతపల్లి మండలం గుడికొండ గ్రామంలో 34.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 505.70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.4864 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,841 క్యూసెక్కులు ఉంది.
పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతులకు రెండు నెలలపాటు బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందని ఆ సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతులు మే 1న గ్రామీణ సంస్థకు ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలన్నారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. వారం రోజుల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మునగాల వద్ద జరిగిన యాక్సిడెంట్ మరువక ముందే ఇవాళ కోదాడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్లపై వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
దేవరకొండకి చెందిన అజీజ్ అత్యంత ఎత్తైన (11,649 ఫీట్ల) ప్రదేశం”జోజి లా పాస్ “కు చేరుకున్నాడు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. దేవరకొండ నుంచి బైక్పై ఆరు రోజుల్లో అక్కడికి వెళ్లిన అజీజ్ పర్వతాన్ని అధిరోహించాడు. అజీజ్ను పలువురు ప్రశంసిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.