India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీ కోసం ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నామినేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని 16 స్థానాల్లో తామే ముందంజలో ఉన్నామన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. ఉమ్మడి జిల్లాలోని 2 స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు వరుసగా ఈ 3 రోజుల పాటు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలు ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. NLG, BNG స్థానాలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీల వారు నామినేషన్లు పెద్దగా దాఖలు చేయలేదు. ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరే నామినేషన్లు వేయగా, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువమంది నామినేషన్లు వేశారు.
నల్గొండ జిల్లా కనగల్ మండలంలో వర్షాభావ పరిస్థితుల తోడు ఏఎమ్మార్పీ నీటిని చెరువుల్లోకి విడుదల చేయకపోవడంతో రెండు దశాబ్దాల తరువాత మొదటి సారిగా కనగల్ మైల సముద్రం చెరువు ఎండింది. ఈ చెరువు కింద దాదాపు 1,600 ఎకరాలకు పైగా సాగవుతోంది. 0.750 టీఎంసీల సామర్థ్యం కలిగిన మైల సముద్రం చెరువును నిజాం నవాబులు నిర్మించారు. చెరువు ఎండిపోవడంతో దీనిపై ఆధారపడ్డ 15 గ్రామాలకు పైగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది.
భువనగిరి కలెక్టరేట్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పొన్నాల లక్ష్మయ్య, ముత్తిరెడ్డి యాదగిరి, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి పాల్గొన్నారు.
లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ వివిధ గ్రామాల లండన్ ఎన్నారైలు కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. అమరపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి దశ నుంచే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా అనేక ప్రజ సమస్యల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన NRI యువకులు పాల్గొన్నారు.
లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి లాడ్జీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ను సంప్రదించాల్సిందిగా సీఐ రమేశ్ కోరారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు లారీ కిందికి దూసుకుపోయింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్కు ఉమ్మడి జిల్లా నుంచి 27,491 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1 విభాగంలో మొత్తం 8,130 మంది, పేపర్-2లో 19,361 మంది దరఖాస్తు చేశారు. NLG జిల్లాలో పేపర్-1లో 3,954 మంది, పేపర్-2లో 9,162 మంది దరఖాస్తు చేశారు. SRPT జిల్లాలో పేపర్-1లో 3,242 మంది, పేపర్-2లో 5,767 మంది దరఖాస్తు చేసుకోగా, యాదాద్రి-BNG జిల్లాలో పేపర్-1లో 934 మంది, పేపర్- 2లో 4,492 మంది దరఖాస్తు చేశారు.
నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డి ఈనెల 24న నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ సమర్పిస్తారు. 12 గంటలకు గడియారం సెంటర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నామినేషన్, బహిరంగ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొననున్నారు.
ఈ నెల 23న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలన్నారు. శోభ యాత్ర సమయంలో ఇతర మతాల మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చెయ్యవద్దన్నారు.
Sorry, no posts matched your criteria.