Nalgonda

News April 19, 2024

యాదాద్రి: రెండు తలలతో గొర్రె పిల్ల జననం

image

భువనగిరి మండలం పెంచికలపాడులోని బాల్దా రాములుకు చెందిన గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. దీంతో గ్రామస్థులంతా ఆ గొర్రె పిల్లను చూడడానికి వచ్చారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. కాగా పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల చనిపోయింది.

News April 19, 2024

ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

image

భారతదేశ ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు, మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదేళ్ల లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.

News April 19, 2024

కలెక్టరేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు రాచకొండ భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ఏర్పాటు చేసినందున కలెక్టరేట్ ప్రాంగణం బయట 100 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. 

News April 19, 2024

షాకింగ్.. కోదాడలో పశువుల కొవ్వు నుంచి నూనె తయారీ 

image

పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేసిన నూనెను కోదాడలో పోలీసులు పట్టుకున్నారు. 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. షేక్.యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నడుపుతుంటాడని.. నూనె తయారు చేసి HYDలో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా పట్టుకున్నామన్నారు.

News April 19, 2024

NLG: జీతాల కోసం అంగన్వాడీల ఎదురుచూపు

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు జీతం కోసం ఎదురు చూస్తున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నెల ముగింపునకు వస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18 వేలు చెల్లిస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఈ హామీని వెంటనే అమలు చేయాలని సీఎంను అంగన్వాడీలు కోరుతున్నారు.

News April 19, 2024

నల్గొండ, భువనగిరిలో హోరాహోరీ 

image

నల్గొండ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే ఈనెల 25న నామినేషన్ల కార్యక్రమం అనంతరం ప్రచార సభలకు ఆయా పార్టీల అగ్రనేతలు నల్గొండ, భువనగిరికి రానున్నారు.

News April 19, 2024

నల్గొండ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు

image

డిండి మండలంలోని ఓ తండాకు చెందిన బాలికను నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం మర్రిపల్లి తండాకు చెందిన అంగోత్ వినోద్ ప్రేమ పేరుతో అపహరించి పలుమార్లు బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశారు. 2023 ఫిబ్రవరి 20న మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.53 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి బి.తిరుపతి తీర్పు ఇచ్చారు.

News April 19, 2024

నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు ఏడు నామినేషన్లు

image

నల్గొండ లోక్ సభ స్థానానికి తొలిరోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందనకు పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ ప్రభాకర్, సోషలిస్టు పార్టీ తరఫున రచ్చ సుభద్రారెడ్డి, ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. యాదాద్రి నుంచి ముగ్గురు నామినేషన్ వేశారు.

News April 19, 2024

22లోగా ఫారం- 12 ను సమర్పించాలి: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనే
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు ఈనెల 22లోగా ఫారం- 12 ను సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. 22 తర్వాత సమర్పించే ఫారాలు పరిగణనలోకి తీసుకోబడవని ఆమె స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

News April 19, 2024

NLG: కళాశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్సియల్ వసతి కలిగి విద్యాబోధనలతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండి కాంపీటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్న కళాశాలలు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని షె.కు.అ.శాఖ ఉపసంచాలకులు తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు నేటి వరకు 5 ఏళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొఫైల్ తో పాటు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.