Nalgonda

News April 14, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఫోకస్

image

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. శనివారం నాటికి రూ.12.66 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.

News April 14, 2024

నకిరేకల్: కోడ్ ఉల్లంఘనపై సి-విజిల్‌లో ఫిర్యాదు

image

నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో బస్ షెల్టర్‌పై మాజీ ప్రజాప్రతినిధి పేరు కనిపించే విధంగా పెద్ద బోర్డు నేటికి అలాగే ఉందని, పంచాయతీ అధికారులు కోడ్ అమలులో శ్రద్ధ చూపడం లేదని శనివారం గ్రామస్థులు కోడ్ ఉల్లంఘనల కింద ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అసెంబ్లీ నియోజకవర్గ ఏఆర్వో కార్యాలయం సువిధ విభాగం అధికారులు వెంటనే స్పందించారు.

News April 14, 2024

NLG: ఓటు నమోదుకు రెండు రోజులే అవకాశం!

image

ఓటరు నమోదుకు ఈనెల 15 వరకే అవకాశం ఉంది. లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటు జాబితాలో పేరు ఉండాలి. అయితే 18 ఏళ్లు నిండినా ఇంకా ఓటు హక్కు పొందని వారు వెంటనే నమోదు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం సూచిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్హత ఉన్నా.. ఓటు రాదని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితి రాకుండా ముందస్తుగా తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు, బీఎల్వోల వద్ద జాబితా చూసుకోవాలని సూచించారు.

News April 14, 2024

నల్గొండ జిల్లాకు దక్కిన మరో అరుదైన ఘనత!

image

నల్గొండ జిల్లాకు మరో అరుదైన ఘనత దక్కింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డీఎస్వో వెంకటేశ్వర్లు, డీసీవో కిరణ్ కుమార్, అధికారి నాగేశ్వర్‌రావుతో కలిసి అదనపు కలెక్టర్ శనివారం కొత్తపల్లి, కేశరాజుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటికే 77,785 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

News April 14, 2024

80 మంది ఉద్యోగులకు నోటీసులు

image

దేవరకొండ పట్టణంలో ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన 80మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ నెల 4, 6వ తేదీల్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించగా 80మంది గైర్హాజరయ్యారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యి వారికి నోటీసులు పంపారు. ఎందుకు హాజరు కాలేదో కారణం చెప్పాలన్నారు.

News April 14, 2024

NLG: పరీక్షలకు వేళాయే

image

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 22 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు జరుగనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట ప్రకటించిన పరీక్షల షెడ్యుల్‌‌లో మార్పులు చేసి ఉదయం పూటనే అన్ని పరీక్షలు నిర్వయించేందుకు టైం టేబుల్ రిలీజ్ చేశారు. జిల్లాలోని ప్రభువ్వ, ప్రైవేట్, గురుకులాలకు సంబంధించి 1,527 పాఠశాలకు పరీక్షలు కొనసాగుతున్నాయి. వీటిలో 1,19,030 మంది విద్యార్థలు చదువుతున్నారు.

News April 13, 2024

NLG: ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ ఫోకస్!

image

కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని 2 సిట్టింగ్ పార్లమెంటు స్థానాలపై రేవంత్ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జిల్లా కాంగ్రెస్ పై పట్టు కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. జిల్లాలో తన టీమ్ ఏర్పాటు కోసమే దిగ్గజనేతల మధ్య సమన్వయం కోసం స్వయంగా రేవంత్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

News April 13, 2024

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: రాజగోపాల్ రెడ్డి

image

బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు యాదగిరిగుట్ట పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారని.. దీంతో భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..

News April 13, 2024

రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా వాసి మృతి

image

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్య గూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సుంకరి మొగ్గయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో క్యాబ్లో వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ అజాగ్రత్తతో ముందున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మొగ్గయ్యగూడెంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 13, 2024

SRPT: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చింతలపాలెం మండలం చింత్రియాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.