Nalgonda

News April 11, 2024

NLG: గర్భం దాల్చిన తొమ్మిదో తరగతి బాలిక

image

తొమ్మిదో తరగతి చదివే బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన మోతె మండల పరిధిలో జరిగింది. SI యాదవేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ తండాకు చెందిన 14ఏళ్ల బాలికను అదే తండాకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. అనారోగ్యానికి గురైన బాలికను వైద్యులు పరీక్షించగా. 3 నెలల గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

News April 11, 2024

NLG: తనిఖీలలో రూ. 2.48 కోట్లు స్వాధీనం

image

లోక్ సభ ఎన్నికల నియమావళితో అధికార యంత్రాంగం జిల్లాలో ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇప్పటివరకు జిల్లా సరిహద్దు చెక్ పోస్టులతో పాటు ఎస్ఎస్‌టీ కేంద్రాల ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.2,48,58,597 నగదుతో పాటు 13.406 గ్రాముల బంగారం ఆభరణాలు, 3,453 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాస్తవ దృవపత్రాలు చూపిన వారికి 24 గంటల్లో తిరిగి నగదు, బంగారు వస్తువులను అందజేస్తున్నారు.

News April 11, 2024

నల్గొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరిక

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో ఇతర నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల నియమావళి కింద పరిగణించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. కుల, మత, వర్గ భాషాపరమైన అంశాల ఆధారంగా రెచ్చగొట్టడం, ప్రేరేపించడం లాంటివి చేస్తే సహించబోమని హెచ్చరించారు.

News April 11, 2024

36,596 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 36,596 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా.. రైతుల ఖాతాలలో 12 కోట్ల 66 లక్షల రూపాయల జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హరిచందన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

News April 11, 2024

లోక్ సభ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి:కలెక్టర్ హరిచందన

image

NLG:లోక సభ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం,రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు.బుధవారం ఆమె మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని,ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను, ఈవీఎంల కమీషనింగ్ రూములను పరిశీలించారు.

News April 10, 2024

సూర్యాపేట: బీ అలర్ట్: కలెక్టర్ హరిచందన

image

SRPT కలెక్టరేట్లో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి SRPT కలెక్టర్ ఎస్. వెంకటరావుతో కలిసి NLG, SRPT జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు కలెక్టర్లు,SRPT జిల్లా ఏఆర్వోలు, నోడల్ ఆఫీసర్స్, సెక్టోరియల్ ఆఫీసర్స్ తో NLG పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు.

News April 10, 2024

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

image

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరబాద్‌లోనిఎమ్మేల్యే రాజ్‌గోపాల్ రెడ్డి నివాసంలో చర్చించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.

News April 10, 2024

NLG: నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ఉదయం సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 510.30 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 132.8618 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గత సంవత్సరం ఇదే సమయంలో 528.00 అడుగులు, 164.2680 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ లో 6,846 క్యూసెక్కులు ఉంది.

News April 10, 2024

నల్గొండ: రెండు తలల గొర్రె పిల్ల జననం 

image

తిప్పర్తి మండలంలోనీ అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన కన్నెబోయిన చెన్నయ్య గొర్రెల మందలోని ఓ గొర్రె మంగళవారం సాయంత్రం రెండు తలలతో గొర్రె పిల్లకి జన్మనిచ్చింది. వింత ఆకారంలో జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చాారు. జన్యుపరమైన లోపంతో ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. 

News April 10, 2024

రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న సీఎం రేవంత్

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం ఎన్నికపై సమీక్ష చేయనున్నారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ ఛార్జీగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.