Nalgonda

News June 7, 2024

NLG: జిల్లాలో గ్రూప్-1ప్రిలిమినరీ పరీక్షకు 47 కేంద్రాలు ఏర్పాటు: ASP

image

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ రాములునాయక్ తెలిపారు. ఈనెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా పోలీసు కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పరీక్షకు జిల్లా నుండి 16,899 మంది హాజరవుతారన్నారు.

News June 6, 2024

NLG: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు నాదే: తీన్మార్ మల్లన్న

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

News June 6, 2024

తిప్పర్తి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై ARO కె. వెంకటేశ్వర్లు తిప్పర్తి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దుప్పలపల్లి గోడౌన్‌లో విధులు నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బ్యాలెట్ పేపర్ చూపించాలని బెదిరించారన్నారు. తన విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News June 6, 2024

నల్గొండ: పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలి: రాకేశ్‌రెడ్డి

image

ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తాము గెలుస్తామని, తమ గెలుపును ఆపాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలన్నారు. గెలుపు, ఓటములను స్వీకరిస్తామని అన్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తామని నమ్మకముందన్నారు.

News June 6, 2024

నల్గొండ: ముగిసిన మూడోరౌండ్.. మల్లన్నకు 18వేల లీడ్

image

నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.

News June 6, 2024

నల్గొండ : అధికంగా నమోదవుతున్న చెల్లని ఓట్లు

image

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో చెల్లని ఓట్లు అభ్యర్థుల అంచనాలు తారుమారు చేస్తున్నాయి. మూడురౌండ్లు ముగిసేసరికి 20 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చెల్లని ఓట్ల బ్యాలెట్ పేపర్‌లో జై మల్లన్న, జై రాకేష్ రెడ్డి అంటూ రాశారు. మరికొందరు అభ్యర్థిని ప్రశంసిస్తూ ఆప్షన్ అంకె వేయకుండా ఐలవ్యూ అని రాశారు.

News June 6, 2024

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగో రౌండ్ ఓట్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు కాని పక్షాన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేయనున్నట్లు తెలిపారు.

News June 6, 2024

అమెరికాకు కోమటిరెడ్డి 

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు అమెరికా వెళ్తున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంతో పాటు మంత్రి అమెరికాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరు రోజులపాటు జరిగే కార్యక్రమాలలో పాల్గొని మంత్రి అనంతరం తిరిగి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటారు.

News June 6, 2024

లైంగిక దాడి కేసులో 14 రోజుల రిమాండ్

image

లైంగిక దాడి కేసులో HZNR కోర్టు ఇద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై సంవత్సరం క్రితం ఒకరు, 10 రోజుల క్రితం మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. నిందితులు రాములు, యాదగిరిని అరెస్ట్ చేసి HZNR కోర్టులో హాజరుపర్చగా.. వారిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News June 6, 2024

NLG: నేటి నుంచి బడిబాట షురూ..!

image

జిల్లాలో నుంచి నేటి ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు జయశంకర్ బడిబాట పేరుతో ఈ కార్యక్రమానికి విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు.