India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా అత్యధికంగా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గం మీదుగా డోర్నకల్, గద్వాల రైలు మార్గం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ మార్గంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో చింతపల్లి మండల సమీపంలో ల్యాండ్ మార్క్ వేశారు. కాగా ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరనుంది.
నల్గొండ ప్రభుత్వ డైట్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు గాదే శౌర్య రెడ్డి ఈరోజు వారి నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఎంతోమందిని వ్యాయామ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, సమాజానికి కృషి చేసిన వ్యక్తి మరణించడం బాధాకరమని డైట్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. వారి అంత్యక్రియలు మఠంపల్లిలో నేడు జరగనున్నాయి.
బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో వద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాదు.
ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సుమారు 1,200 మంది ఆర్టిజన్ ఉద్యోగులలో కొంత మంది నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో కొంతమంది విద్యార్హత లేకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తూ బురిడీ కొట్టించారు. 11 మంది ఆర్టిజన్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు నకిలీవిగా తేల్చారు.
నందికొండలో వాటర్ ట్యాంక్లో వానరాల కళేబరాల మృతి ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థతి అన్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
చౌటుప్పల్లో జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఓ కారు వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బొజ్జ సామ్రాజ్యం(60) అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మృతురాలిది ప్రకాశం జిల్లా కామినేని వారి పాలెంగా గుర్తించారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 12 మందిని నియమిస్తూ టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. DVK – కె. మంజులారెడ్డి, సాగర్ -మహేందర్ రెడ్డి. MLG – సల్ల నరేష్ కుమార్, HZNR- రేణుక, KDD- అల్లం ప్రభాకర్రెడ్డి, SRPT – కొల్లూరు పుష్పలీల, NLG – నిరంజన్ రెడ్డి, MNGD- వజ్ర సంధ్యారెడ్డి, BNG-శిరీష్ రెడ్డి, NKL-దుడం వెంకటరమణ నియమించింది.
మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు చనిపోయిన ఘటన రామన్నపేట మం. కక్కిరేణిలో జరిగింది. యాదయ్య, అంజమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవీన్కు ఉత్తటూరుకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా నవీన్ నిన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెళ్లి కొడుకును చేసే టైం అవుతున్నా.. నవీన్ లేకపోవడంతో వెతకగా పొలం వద్ద విగతజీవిగా ఉన్నాడు. నవీన్ మృతి పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.
Sorry, no posts matched your criteria.