India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వెళుతున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన అమనగంటి ఎల్లమ్మ మృతిచెందగా, ఆనంతమ్మ , భారతమ్మ, పూలమ్మ, ఎల్లయ్య గాయపడ్డారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కరవు చుట్టూ తిరుగుతోంది. సాగర్ కాల్వతో పాటు బోరు బావుల కింద పంటలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. తమ హయాంలో నీళ్లు ఇచ్చామని చెబుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి మీరేమంటారు.
సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి పిర్యాదు అందిన వెంటనే పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి పోలీస్ సైబర్ వారియర్స్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ హాల్ నందు జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ కి మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ అందజేసి అనంతరం మాట్లాడారు.
నల్గొండలోని అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ పై పానగల్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికు తెలిపిన వివరాల ప్రకారం.. షిఫ్ట్ కారును ధాన్యం ట్రాక్టర్ ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డాడు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా ప్రభుత్వ భవనాలు, స్థలాలలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని
జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అతిథి గృహాలు, విశ్రాంతి గృహాలు, ప్రభుత్వ రంగ సంస్థల అతిథి గృహాలలో ఉంటూ ఏటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ పదవికి బానోతు రతన్ సింగ్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ప్రభారీ పని తీరు వల్ల నష్టపోయామని, పార్లమెంట్ ఎన్నికలలో నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
KMM , SRPT జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకై నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ద్వారా తాగునీటిని విడుదల చేయగా జిల్లా కలెక్టర్ హరిచందన బుధవారం వేములపల్లి వద్ద నీటి సరఫరాను పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు నాగేశ్వరరావును.. నీటి సరఫరా వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూరు మండలం కురుమూర్తి గ్రామానికి చెందిన గుండెగోని హరిబాబు(27) తాగుడుకు బానిస అయ్యాడు. తల్లి లక్ష్మమ్మ హరిబాబును మందలించడంతో మనస్థాపం చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్లాడు. చెరువు అన్నారం గ్రామ శివారులో ఒక స్మారక స్థూపానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ అప్జల్ అలీ బుధవారం తెలిపారు.
కనగల్, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా సర్వే పూర్తయింది. డోర్నకల్ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ఏర్పాటుకు ప్రాథమిక సర్వే పూర్తి అయింది. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఏమైనా సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నేరుగా రైతులు కంట్రోల్ రూం నంబర్ కు 6281492368 నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందానని సూచించారు.
Sorry, no posts matched your criteria.