India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. ప్రచారాలకు ఉపయోగించే వాహనాలు, మైకులకు ముందస్తుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రార్థన మందిరాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు మనవే అని నల్గొండలో నిర్వహించినBRS సన్నాహక సమావేశంలో KTR అన్నారు. ‘నల్గొండ, మిర్యాలగూడ, కోదాడను ఎంతో అభివృద్ధి చేశాం. మూడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. జిల్లాలో ఫ్లోరోసిస్ రూపుమాపడంతోపాటు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోలేకపోయాం. NLG కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలున్నారు’ అన్న KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హత్యలు, దందాలు, బెదిరింపులు, అక్రమ వ్యాపారాలు ఇతర నేరాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,936 మంది పాత నేరస్థులను పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లుగా ఉన్న వారు, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. జిల్లాలో ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్న సమయంలో నిప్పులు కురిపిస్తుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలో 43.0 డిగ్రీలు, చింతపల్లి మండలం గొడకండ్లలో 37.6 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మునగాల మండలంలో 42.2 డిగ్రీలు, తుంగతుర్తి మండలంలో 36.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో విద్యుత్ స్తంభం పైనుంచి పడి కేబుల్ కార్మికుడు దుర్మరణం చెందాడు. చిల్లకల్లు పోలీసుల కథనం మేరకు.. దామరచర్ల మండలం బల్లిగుంట తండాకు చెందిన కిరణ్ (30).. చిల్లకల్లు కేబుల్ పనుల గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. విద్యుత్ స్తంభానికి అమర్చాల్సిన కేబుల్ తీగ కోసం నిచ్చెన సాయంతో పైకి ఎక్కాడు. అకస్మాత్తుగా పైనుంచి పడిపోవడంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగి చనిపోయాడు.
సాగర్ ఎడమ కాల్వకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. వెయ్యి క్యూసెక్కులతో మొదలయ్యి 2,500 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని వృథా చేయకుండా కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని అధికారులు కోరారు. అయితే సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.40 అడుగులుగా ఉంది.
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ముగిశాయి. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు విద్యా శాఖ సన్నద్ధమవుతుంది. ఇందు కోసం నల్గొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేశారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ.2.43 కోట్లు పట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న నగదు రూ.1.17 కోట్లు, 7403 లీటర్ల మద్యం విలువ రూ. 29.35 లక్షలు, 10 వాహనాల విలువ 2.32 లక్షలు, అలాగే బంగారం, ఇతర ఆభరణాలు విలువ రూ. 23.32 లక్షలు, ఇతర వస్తువుల విలువ 70.28 లక్షలు ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.