India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికివ్వాలన్న దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఈ టికెట్ తనకు ఇవ్వాలని, ఏడాదిన్నరనుంచి నియోజకవర్గంలో పని చేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టు పడుతుండగా, వివిధ సర్వేల తరువాత అధిష్టానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీలో నిలపాలని ఆయనపై ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా బీసీ అంశం తెరపైకి వచ్చింది.
వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నీటి నిల్వలు పడిపోయిన జిల్లాల జాబితాలో NLG కూడా చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం 15 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా చందంపేట మండలంలో 16 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఇప్పుడు 16 మీటర్ల పడిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది NLG జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి తీరు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు స్థానికంగా ఉండే జనరల్ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ NLG ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలను వైద్యులు పక్కన పెట్టారు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చండూరు, నేరేడుచర్ల, యాదగిరిగుట్ట మినహాయించి అన్నింట్లోనూ బీఆర్ఎస్కు ఆధిక్యం వచ్చింది. మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, ఆలేరు, పోచంపల్లి, సూర్యాపేటల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వారు ఛైర్మన్లు ఉన్నారు. వీటిని కూడా చేజిక్కుంచుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, RRB, SSC రాష్ట్ర స్థాయి& కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న NLGలో గల విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల విడుదలైన ‘రజాకార్’ సినిమాను వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో రేపు మార్నింగ్, మ్యాట్నీ షోలు వేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సహకారంతో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
మునగాల మండలం ఆకుపాముల శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వెంకట నర్సయ్య అతని తల్లి రాంబాయమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు మేళ్లచెరువుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తవిడబోయిన చంద్రశేఖర్ అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. శేఖర్ కూతురు గాయత్రి మంగళవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.
Sorry, no posts matched your criteria.