Nalgonda

News March 26, 2024

సూర్యాపేట మీదుగా రైలు మార్గం

image

డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.

News March 26, 2024

నల్గొండ: ఫస్ట్ నుంచి కొనుగోళ్లు షురూ

image

ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.

News March 25, 2024

సూర్యాపేట: వాహన తనిఖీలు.. బంగారం పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో సోమవారం సూర్యాపేటలో పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న షేక్ నాగుల్ మీరా కారులో 56 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి నగదును స్వాధీనం చేసుకొని FST అధికారులకు అందజేశామని రూరల్ ఎస్సై బాలు నాయక్ సోమవారం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని ఎస్సై సూచించారు

News March 25, 2024

NLG: రాచకొండ పై రేకెత్తుతున్న ఆశలు!

image

ఘనమైన చరిత్ర కలిగి, రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న రాచకొండ ప్రాంత అభివృద్ధికి అడుగులు పడడం లేదు. ఫిలిం సిటీ, స్పోర్ట్స్ సిటీ, నెమళ్ల పార్కు, రోప్వే వంటివి ఏర్పాటు చేసి రాచకొండకు పూర్వ వైభవం తీసుకొస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. రాచకొండను HYD, SEC, సైబరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఇటీవల CM రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి.

News March 25, 2024

క్రేన్ ఢీ.. వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు 

image

హుజూర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని క్రేన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీర భాగాలు నుజ్జు నుజ్జు కాగా హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

News March 25, 2024

నిడమనూరు: హోలీ వేడుకలకు దూరం

image

నిడమనూరు మండల పరిధిలోని ముప్పారం గ్రామంలో ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండటం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తోంది. రోజంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. దీంతో ఆ గ్రామస్థులు హోలీ వేడుకలకు దూరంగా ఉంటారు. స్వామివారి కల్యాణోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

News March 25, 2024

నల్గొండ: కలర్ పడుద్ది.. కండ్లు భద్రం..!

image

హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.

News March 25, 2024

దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కొండమల్లేపల్లి మండలం బాపూజీ నగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్మూర్తి వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఇంటిలో రమావత్ బాలు నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు ప్రేమ్(2) ఇంటి ఆవరణలో రోడ్డుకు సమీపంలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా క్రేన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News March 25, 2024

తిప్పర్తి: అంతుచిక్కని జ్వరాలు

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డల గూడెంను అంతుచిక్కని జ్వరాలు వణికిస్తున్నాయి. గ్రామంలో సగం మంది హాస్పిటళ్లలో చేరుతున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒకరు అనారోగ్యంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2 నెలలుగా స్థానికంగా ఫీవర్ క్యాంపు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాన్ని ఇప్పటికే జిల్లా, రాష్ట్ర వైద్యం బృందం పరిశీలించారు.

News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.