India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో RTC బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతతోపాటు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్లలో తాగునీరు, బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు కనిపించని పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణించే వారి టికెట్ పై పల్లె వెలుగుల్లో రూ.2, ఇతర బస్సుల్లో రూ.6 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సమకూరుతున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడం లేదు.
రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.
BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పంపారు. నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఆశించిన తేరా చిన్నపురెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కేటాయించకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్కుమార్రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
నల్గొండ, భువనగిరి లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.
హుజూర్నగర్లో రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాలీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మఠంపల్లిలో వాచ్మెన్గా పనిచేస్తున్న కొనుగంటి నర్సిరెడ్డి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. నల్గొండ జిల్లాలోని హాలియా, నందిగొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఆయా చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో శుక్రవారం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా కాంగ్రెస్ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. హాలియా నూతన ఛైర్ పర్సన్గా యడవెల్లి అనుపమా, నందిగొండ ఛైర్ పర్సన్గా అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాయిన వాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయలైన వ్యక్తిని సాగర్ కమల నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. వారు నాగార్జున సాగర్కు వాసులుగా గుర్తించారు.
పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని NLG జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అంబటి యాదగిరి తెలిపారు. జిల్లాలో సుమారు 2లక్షల తెల్లపశువులు, 3.11 లక్ష నల్లజాతి పశువులకు టీకాలను వేయడానికి 74 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.