Nalgonda

News May 17, 2024

సూర్యాపేట: రూ.2 లక్షలు ఇచ్చాక తల్లికి తలకొరివి

image

నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో ఆస్తి వివాదం విషయంలో <<13263429>>అంత్యక్రియలు ఆగిన<<>> విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియల ఖర్చును తాను భరించలేనని, డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని కొడుకు అన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియల‌ను నిర్వ‌హించారు.

News May 17, 2024

సూర్యాపేట: ఆస్తి తగాదాలతో ఆగిన తల్లి అంత్యక్రియలు

image

మానవత్వం మంట కలిసిపోతోందనటానికి ఈ ఘటనే నిదర్శనం. తల్లి మృతిచెంది రెండు రోజులవుతున్నా డబ్బు కోసం అంత్యక్రియలు నిర్వహించని అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెంలో లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో మరణించింది. తన పేరిట ఉన్న ఆస్తులు పంపకంలో కుమారుడు, కూతురు మధ్య వివాదం తలెత్తింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేదు.

News May 17, 2024

 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు

image

నల్గొండ జిల్లాలో 2024 సంవత్సరంలో హరిత లక్ష్యం ఖరారైంది. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్యం నిర్ణయించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 844 పల్లె నర్సరీలలో మొక్కలు పెంచే పనులను ప్రారంభించారు. గత 9 ఏళ్లలో గత ప్రభుత్వం 10 కోట్ల మొక్కలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాటారు.

News May 17, 2024

చిట్యాల వద్ద యాక్సిడెంట్ 

image

చిట్యాల మండలం వెలిమినేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 17, 2024

నల్గొండ: పట్టభద్రులూ.. సరిగా ఓటేయండి

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

News May 17, 2024

నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ 2,4,6 రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీ పరిధిలో 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగే సెమిస్టర్ పరీక్షలకు 36,392 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 2వ సెమిస్టర్లో 12,525, 4వ సెమిస్టర్లో 12,313, 6వ సెమిస్టర్ లో 11,554 మంది పరీక్ష

News May 17, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: జిల్లా ఎస్పీ

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం వంటివి చేయకూడదని తెలిపారు.

News May 17, 2024

యాదాద్రి: రూ.16 కోట్ల ఇంజెక్షన్ వేయించలేక చిన్నారి మృతి

image

వలిగొండ మండలం గోలిగూడేనికి చెందిన దిలీప్‌రెడ్డి-యామిని దంపతుల కుమారుడు భవిక్‌రెడ్డి(6నెలలు). ఆ చిన్నారి జన్మించిన మూడో నెల నుంచి శరీర కదలికలు సరిగా లేవు. చాలా ఆస్పత్రుల్లో చూపించారు. నయం కావడానికి ఇంజెక్షన్‌ ఒక్కటే మార్గమని, అది USలో లభిస్తుందని, దాని ఖరీదు రూ.16 కోట్లని వైద్యులు తెలిపారు. విరాళాలుగా రూ.10 కోట్లే సమకూరాయి. ఇంజెక్షన్ వేయించలేకపోవడంతో బాబు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

News May 17, 2024

NLG: ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

image

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు ఈ. రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరేందుకు చివరి అవకాశం మే 19 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా, 7032415062 నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారై ఉండాలని తెలిపారు.

News May 16, 2024

 NLG: ACBకి చిక్కిన విద్యుత్ అధికారి

image

నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మల్లారెడ్డిపల్లిలో TSSPDCL ఆర్టిజన్ గ్రేడ్ 2 ఉద్యోగి నడింపల్లి వేణు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన సూర్యనారణ వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ కోసం సంప్రదించగా వేణు రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు రైతు తెలిపాడు. దీంతో రైతు ACB అధికారులకు విషయం తెలుపగా వారు వేణును రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.