India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 74.13శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 75.04 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి ఉత్తమ్(INC) 25,682 మెజార్టీతో నరసింహారెడ్డి(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

ఈవీఎంలను నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద గోదాంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. అయితే వాటికి రక్షణగా మూడంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు

నల్గొండ లోక్సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. DVK-70.60%, HNR-76.34%, KDD-75.21%, MLG-73.34, సాగర్-74.50%, NLG-75.20, SRPT-73.07%గా ఉంది. మొత్తంగా 74.02% పోలింగ్ నమోదైంది. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కృష్ణారెడ్డి, బీజేపీ తరఫున సైదిరెడ్డి పోటీ చేశారు.

భువనగిరి లోక్సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఆలేరు- 82.81%, భువనగిరి- 82.71%, ఇబ్రహీంపట్నం- 66.83%, జనగాం-74.68%, మునుగోడు- 83.71%, నకిరేకల్ -77.11%, తుంగతుర్తి- 74.06%గా ఉంది. మొత్తంగా 76.78% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఇదే టాప్. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య , బీఆర్ఎస్ నుంచి మల్లేశ్ బరిలో ఉన్నారు.

రైలు పట్టాల పక్కన మహిళ మృతదేహం లభ్యమైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రైల్వే పోలీసుల వివరాలిలా.. నాగిరెడ్డిపల్లి – బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య అనాజిపురం సమీపాన మహిళ మృతదేహం లభ్యం కాగా.. రైలు నుంచి చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 87125 68454ను సంప్రదించాలన్నారు.

నల్గొండ జిల్లాలో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు. త్రిపురారం మండలం నీలాయగూడెంలో యువకులు క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. వారంతా చెట్టుకిందికి వెళ్లగా పిడుగుపడింది. దీంతో ఓ యువకుడు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

ఉమ్మడి నల్గొండ గత ఎన్నికలతో పోలిస్తే రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 2019 ఎన్నికల్లో నల్గొండ పోలింగ్ శాతం 78.7%గా నమోదు కాగా ఈ సారి 73.85% నమోదైంది. భువనగిరి పార్లమెంట్లో గత ఎన్నికల్లో 79.3% నమోదు కాగా, ఈ సారి 76.47% నమోదైంది.

చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఓటరు జాబితాలో తన భార్య పేరు లేదని ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన NKL జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. NKL శివాలయం వీధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఓటు వేసేందుకు కుటుంబంతో పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. జాబితాలో అతని భార్య పేరు తొలగింపునకు గురైంది. 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో తను ఓటు వేసిందని. ఇపుడు ఎందుకు లేదని బీఎల్వోలతో వాగ్వాదానికి దిగాడు.

ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బండారు నాగరాజు (యువతరం పార్టీ) స్వతంత్ర అభ్యర్థులు పోతుల ప్రార్థన, పోతుల యాదగిరి, సోమగాని నరేందర్, గంగిరెడ్డి కోటిరెడ్డి, బండారు నాగరాజు, దైద సోమ సుందరం, రత్నం ప్రవీణ్, కేడారి మేకల, రత్నం ప్రవీణ్, రేకల సైదులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
Sorry, no posts matched your criteria.