Nalgonda

News March 27, 2024

మోత్కూరు ఎంపీడీవో కార్యాలయంపై ఏసీబీ దాడి

image

మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ సెక్రటరీ కిరణ్ ఏసీబీ వలలో బుధవారం చిక్కాడు. మోత్కూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా ఇంటి అనుమతి కోసం రూ.3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి అనుమతి కోసం బాధితుడు ఇదివరకే రూ.5వేలు ఇవ్వగా మళ్లీ అదనంగా డబ్బులు డిమాండ్ చేయడంతో రూ.3వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

News March 27, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధులు వచ్చాయ్!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. NLG జిల్లాకు రూ. 4.5 కోట్లు, SRPTకు రూ. 2.70 కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.82 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 12 నియోజకవర్గాలకు రూ.120 కోట్లు గత నెలలో మంజూరు చేశారు. వాటిలో నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున తాగు నీటికి ఖర్చు చేయనున్నారు.

News March 27, 2024

సూర్యాపేట: BRSను TRSగా మార్చండి.. KTRకు EX.MLA రిక్వస్ట్..

image

బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా తాజాగా పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యవాదుల దాడిని అరికట్టాలన్నా, ప్రాంతీయతత్వం బతకాలన్నా.. బీఆర్ఎస్ పేరు నుంచి టీఆర్ఎస్‌గా మారాల్సిన అవసరం చాలా ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

News March 27, 2024

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

image

తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల మమత, కుమార్ ల కుమారుడైన ముక్కర్ల ఉమేష్ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 4.30 గం.లకు కట్లపాము కాటు వేయడంతో భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

News March 27, 2024

NLG: అంగన్ వాడి టీచర్లపై పెరిగిన పని భారం

image

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీ టీచర్లపై పని భారం పెరిగింది. ఇప్పటికే అంగన్‌వాడీ సేవలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తుండగా.. తాజాగా అంగన్వాడి టీచర్లకే NHTS కుటుంబ సర్వే కూడా అప్పగించారు. స్మార్ట్ ఫోన్లలో ర్యాం, స్టోరేజీ తక్కువగా ఉండడంతో సతాయిస్తున్నాయి. గ్రామాలలో నెట్ సేవలు కూడా అందుబాటులో లేకపోవడంతో ఆన్లైన్ కుటుంబ సర్వేకు ఆటంకం కలుగుతుంది.

News March 27, 2024

యాదాద్రి: దారుణం.. రెండున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలికను తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులోని రసాయన పరిశ్రమలో ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

నల్గొండ ఎంపీ అభ్యర్థి మార్పు తప్పదా?

image

నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మార్చేందుకు ఆ పార్టీ అధిష్టానం యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సైదిరెడ్డిని మార్చాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చినట్లు సమాచారం. 

News March 27, 2024

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై తర్జనభజన

image

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికివ్వాలన్న దానిపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఈ టికెట్ తనకు ఇవ్వాలని, ఏడాదిన్నరనుంచి నియోజకవర్గంలో పని చేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పట్టు పడుతుండగా, వివిధ సర్వేల తరువాత అధిష్టానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీలో నిలపాలని ఆయనపై ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉంటే కొత్తగా బీసీ అంశం తెరపైకి వచ్చింది.

News March 27, 2024

NLG: పాతాళానికి గంగమ్మ..

image

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నీటి నిల్వలు పడిపోయిన జిల్లాల జాబితాలో NLG కూడా చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం 15 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా చందంపేట మండలంలో 16 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఇప్పుడు 16 మీటర్ల పడిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది.

News March 27, 2024

NLG: లక్షలు ఖర్చు చేస్తున్నా.. అందని వైద్యం!

image

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది NLG జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి తీరు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు స్థానికంగా ఉండే జనరల్ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ NLG ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలను వైద్యులు పక్కన పెట్టారు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.