Nalgonda

News March 26, 2024

నల్గొండ: గుండెపోటుతో బస్సులోనే మృతి

image

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. బస్సు చిట్యాల వద్దకు రాగానే అతనికి గుండెపోటు వచ్చిందని తోటి ప్రయాణికులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 26, 2024

స్థానిక సంస్థలపై హస్తం ఫోకస్

image

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. గత పదేళ్లుగా ఎంపీటీసీలు మొదలు జిల్లా స్థాయి చైర్మన్ల వరకు అన్ని భారాస ఖాతాలోనే ఉండటంతో.. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మూడింట రెండొంతుల పురపాలికల్లో హస్తం పార్టీ పాగా వేసింది. మిగిలిన వాటినీ లోక్ సభ ఎన్నికల్లోపే హస్తగతం చేసుకునేలా కసరత్తు చేస్తోంది

News March 26, 2024

బక్కపడుతున్న చిన్నారులు

image

ఉమ్మడి జిల్లాలో చిన్నారులు బలహీనమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరైన పోషకాలు అందక బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 203 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 1, 81, 214 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్.. వారికి నల్గొండతో అనుబంధం

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎందుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. తిరపతన్న యాదగిరిగుట్ట ఎస్సై, భువనగిరి సీఐగా పనిచేశారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు.

News March 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.

News March 26, 2024

నల్గొండ: ఉపాధి హామీ కూలీలకు తీపి కబురు

image

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న దినసరి కూలీని పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 7.52 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. 2005లో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభించిన సమయంలో దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది.

News March 26, 2024

NLG: ఏడాది గడిచినా ఊసే లేదు!

image

ఉమ్మడి జిల్లాలోని గొల్ల కురుమలు గొర్రెల యూనిట్ల విషయంలో ఆందోళనలో పడ్డారు. యూనిట్ల కోసం డీడీల రూపంలో డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయినా గొర్రెలు ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కాపరులు కోరుతున్నారు.

News March 26, 2024

ప్రభుత్వ పాఠశాలలకు రూ.91 లక్షలు మంజూరు

image

నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.

News March 26, 2024

సూర్యాపేట మీదుగా రైలు మార్గం

image

డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.

News March 26, 2024

నల్గొండ: ఫస్ట్ నుంచి కొనుగోళ్లు షురూ

image

ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి. రైతులు ధాన్యం తీసుకువస్తే రెండు, మూడు రోజులు ముందుగానే కేంద్రాలు తెరవడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేసింది.