Nalgonda

News April 27, 2024

వీరి పరిణయం ఆదర్శం 

image

అనంతగిరి మండలం పాలవరానికి చెందిన నాగమణి పుట్టుకతో అంధురాలు. కాగా తల్లి ప్రోత్సాహంతో నల్గొండ అంధుల పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపితో డిగ్రీ పూర్తి చేసింది. ఆమెను వివాహం చేసుకునేందుకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్తికి చెందిన సోమగాని సందీప్ ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ జంట ఆదివారం పెద్దల సమక్షంలో ఒకటి కానుంది. 

News April 27, 2024

NLG: రేపు నామినేషన్ల ఉపసంహరణ లేనట్లే!

image

ఉమ్మడి జిల్లాలో NLG, BNG పార్లమెంట్ స్థానాలకు స్క్రూటినీ పూర్తైంది. నామినేషన్ల పరిశీలన అనంతరం NLGలో 31 మంది అభ్యర్థులు నిలిచారు. BNGలో 51మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా ఉన్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 29 కాగా, ఈ నెల 27వ తేదీ నాలుగో శనివారం కావడం, 28వ తేదీ ఆదివారం కావడంతో నామినేషన్లు ఆయా తేదీల్లో ఉపసంహరణకు దరఖాస్తులు స్వీకరించబోమని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

News April 27, 2024

సూర్యాపేట: బైక్ నుంచి పడి మహిళ మృతి

image

బైక్ నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎర్రగట్టు వద్ద జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

కాంగ్రెస్‌లో చేరిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్

image

మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు బిగ్ షాక్ తగిలింది. మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు 12 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరారు.

News April 27, 2024

నాలుగు రోజుల్లో 8 మంది మృతి

image

జాతీయ రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై రెండు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈనెల 21న మునగాల మండలం ముకుందాపురం ప్రమాదంలో దంపతులు, గురువారం కోదాడ పరిధిలోని శ్రీరంగపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

News April 27, 2024

భువనగిరిలో 10 మంది నామినేషన్లు తిరస్కరణ

image

ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి మెత్తం 61 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన అనంతరం 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 51 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు.

News April 27, 2024

NLG: 25 మంది నామినేషన్ల తిరస్కరణ

image

ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 31 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరి చందన తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.

News April 27, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి: ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లాఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్యవంశీ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా?ఏవైనా సమస్యలు ఉన్నాయా?ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటిస్తున్నారా?అని అడిగి తెలుసుకున్నారు.

News April 26, 2024

NLG: యువతకు 50 వేల ఉద్యోగాలు: శానంపూడి సైదిరెడ్డి

image

పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే యువతకు 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని NLG బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. MLG నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెంలో శుక్రవారం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి, సాధినేని శ్రీనివాసరావు, రంజిత్ యాదవ్, చల్లా శ్రీలతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 26, 2024

ఈతకు వెళ్లి తండ్రి, కోడుకులు మృతి

image

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని రాయిపల్లికి చెందిన బోడ నరేష్ ఆయన కుమారుడు సాయికుమార్‌తో కలిసి మోటకొండూరు మండలంలోని చాడ గ్రామం బంధువుల ఇంట్లో ఎల్లమ్మ పండుగకు వెళ్లారు. పండుగ అనంతరం పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు నీట మునిగి నరేష్, సాయికుమార్‌, మృతి చెందారు.