Nalgonda

News March 25, 2024

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌‌వి అబద్ధపు ప్రచారాలు

image

నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. నల్గొండలో శనివారం ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ 6 పథకాలు అమలు చేయలేదు. వంద రోజుల్లో వంద రూపాయల పని కూడా జరగలేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన రోజునే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.

News March 24, 2024

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

దేవరకొండలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బస్ కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలిని ఢీ కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు నెమలిపూర్ తండాకు చెందిన నీరిగా గుర్తించారు. కాగా ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారులో యువకులు హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి వెళ్తున్నట్టు సమాచారం.

News March 24, 2024

నల్గొండ: వృద్ధురాలు దారుణ హత్య

image

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలోని వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ (68) అదృశ్యమైంది. అప్పటి నుంచి వెతుకుతున్నా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆదివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం దొరికింది. పిచ్చమ్మను దుండగులు హత్య చేసి బావిలో పడేశారని పోలీసులు తెలిపారు.

News March 24, 2024

భర్తను హత్యచేయించిన భార్య

image

తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు కిరాయి వ్యక్తులతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. భార్య, ఐదుగురు నిందితులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2బైకులు, కారు, పుస్తెలతాడు,5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్ లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 24, 2024

సూర్యాపేట: వింత గుడ్లగూబ ప్రత్యక్షం

image

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరిలో వింత గుడ్లగూబ ప్రత్యక్షమైంది. దీనిని బార్ను గుడ్లగూబ అంటారని, ఇది ఎడారి ప్రాంతాలు హిమాలయాలకు ఉత్తరాన ఉన్న ఆసియా, ఇండోనేషియాలోని కొన్ని దీపాలలో మాత్రమే కనిపిస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దాని ముఖం మనిషి పోలిక ఆకారంతో ఉండడంతో దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

News March 24, 2024

నల్గొండలో రసవత్తర పోరు

image

నల్గొండ నుంచి ప్రధాన పార్టీలు తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు ఆర్థికంగా బలం ఉన్న నాయకులే. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుందని నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

News March 24, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

News March 24, 2024

NLG: ప్రయాణికుల కనీస సౌకర్యాలు పట్టని ఆర్టీసీ

image

ఉమ్మడి జిల్లాలో RTC బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతతోపాటు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్లలో తాగునీరు, బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు కనిపించని పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణించే వారి టికెట్ పై పల్లె వెలుగుల్లో రూ.2, ఇతర బస్సుల్లో రూ.6 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సమకూరుతున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడం లేదు.

News March 24, 2024

మిర్యాలగూడ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి 

image

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.