India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి NLG జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 58,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఉమ్మడి NLG జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 58,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
చిట్యాల మండలం <<15626572>>పెద్దకాపర్తిలో <<>>జరిగిన ప్రమాదంలో నల్గొండకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలు.. నల్గొండ మాన్యంచెల్కకు చెందిన నవాజ్, సోహైల్, సల్మాన్, షోయబ్ వెల్డింగ్ పని చేస్తారు. హైదరాబాద్లో వెల్డింగ్ పని ముగించుకొని వస్తుండగా ముందు ఉన్న బస్ సడన్గా ఆగడంతో కారు బస్ కిందికి దూసుకుపోయింది. దీంతో నవాజ్, సోహైల్ స్పాట్లోనే చనిపోయారు. సల్మాన్, షోయబ్ చికిత్స పొందుతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కంటైనర్, రెండు కార్లు ఢీకొనడంతో ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారు.. బస్సు కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ముదిగొండలో జరిగింది. సీఐ నరసింహులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్తెం లక్ష్మయ్య వెంకటమ్మ దంపతులు మద్యం తాగుతూ అప్పుడప్పుడు గొడవ పడుతుండేవారని, శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా మద్యం సేవించి గొడవపడడంతో ఆ గొడవలో భర్త లక్ష్మయ్య భార్యను నెట్టేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
కొందరు అవయవ దానం చేస్తే మరికొందరు నేత్ర దానం చేస్తారు. వాటి కంటే మిన్నగా మిర్యాలగూడకు చెందిన రేపాలలక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు మెడికల్ కళాశాలకు అతడి పార్థివదేహాన్ని అందజేశారు. తమ తండ్రి చివరి కోరిక కావడంతో శనివారం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అందజేశారు. మరణంలోనూ తమ తండ్రి జీవించి ఉండాలనే ఆలోచనతోనే ఇలా చేశామని తెలిపారు.
చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.
నల్గొండ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో జిల్లాలో 2,78,667 మంది అర్హులు ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన, భూములను అమ్ముకున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను ఏటా జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో 19వ విడతలో 1,08,651 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.