India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాను రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షలకు పైగా వీధి కుక్కలు, పదివేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. రేబిస్ నివారణకు అవసరమైన డయాగ్నస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేనున్నట్లు తెలిసింది. ఈ ల్యాబ్ల్లో యాంటీ రేబిస్ ఎలిమినేషన్పై పరీక్షలు నిర్వహిస్తారు.
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో శ్రీ ఆంధోల్ మైసమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దేవాలయ ఈఓ ఎస్.మోహన్బాబు బోనం సమర్పించారు. చండీహోమం నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలొచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి ప్రారంభించారు.
జిల్లాలోని అర్హులైన రైతులందరితో రైతు బీమా చేయించాలని, నెలాఖరు వరకురైతు బీమా రెన్యువల్స్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుండి ప్రజాపాలన సేవా కేంద్రాలను అన్ని ఎంపిడిఓ కార్యాలయాలు, మున్సిపాలిటీలలో పకడ్బందీగా పనిచేసేలా చూడాలని ఎంపీడీవోలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
అంగన్వాడీలను చిన్నారులకు మరింత చేరువ చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా ఈ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇది అమలు అయితే ఈ సెంటర్లు ఇకపై ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు దీటుగా ప్రీ స్కూల్ విద్యను అందించనున్నాయి. సీఎం నిర్ణయంతో ఇన్ని రోజులు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించిన ఈ కేంద్రాలు ఇకపై పిల్లలకు మూడో తరగతి వరకు ప్రాథమిక విద్యను అందించనున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాధులు ముసుకురుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు.
వచ్చే మార్చినాటికి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నార్కట్పల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న SLBC సొరంగం పనుల పూర్తికి రాష్ట్ర సీఎంతో మాట్లాడి రూ.2200 కోట్లు మంజూరు చేయించడమే కాకుండా, నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 68 మంది బత్తాయి రైతులు నిండా మునిగారు. తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 11 ఏళ్ల క్రితం బత్తాయి మొక్కలు తీసుకువచ్చి జిల్లాలో నాటిన రైతులు దిగుబడి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సుమారు 350 ఎకరాల్లో ఈ బత్తాయి మొక్కలు నాటారు. సాధారణంగా నాలుగో ఏటా నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని 8 ఏళ్లు గడిచినా సాధారణ దిగుబడి కూడా రాలేదని రైతులు తెలిపారు.
నార్కట్పల్లి మండల ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెంట్ కోమటి ప్రదీప్ గుండెపోటుతో మరణించారు. బదిలీ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి అనంతరం హైదరాబాదులో నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రదీప్ వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సన్నిహితులు చెప్పారు.
క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.
పంట రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసినట్లు DAO శ్రవణ్కుమార్ తెలిపారు. కాల్ సెంటర్ నంబర్ 7288800023కి ఫోన్ చేయడం ద్వారా రైతులు తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ఫోన్ చేసేటప్పుడు ఆధార్ నంబర్ తెలపాలన్నారు. మండల స్ధాయిలో ఏవోకు ఫోన్ ద్వారా, స్వయంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందాలన్నారు.
Sorry, no posts matched your criteria.