Nalgonda

News February 15, 2025

బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

image

బొమ్మగాని <<15471432>>ధర్మభిక్షం <<>>ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ రవూఫ్‌పై విజయం సాధించారు.

News February 15, 2025

NLG: జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం.. తగ్గిన చికెన్ అమ్మకాలు

image

బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ లేనప్పటికీ చౌటుప్పల్, అక్కంపల్లి, చిట్యాల, సూర్యాపేట తదితర ప్రాంతాలలో వివిధ వ్యాధులతో కోళ్ల ఫారాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం తగ్గించారు. చికెన్ రేట్లు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అమ్మకాలు సరిగ్గా లేవని వ్యాపారస్థులు పేర్కొంటున్నారు.

News February 15, 2025

పోరాటయోధుడు ధర్మభిక్షం

image

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన జయంతి.

News February 15, 2025

నల్గొండ: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

News February 15, 2025

NLG: మరోసారి కులగణన..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి కులగణన నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో 3 లక్షల పైచిలుకు మంది పాల్గొన లేదని తెలిసింది. అయితే వారందరి కోసం మళ్లీ కులగణన నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు కులగణన నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆన్‌లైన్ సర్వేతో పాటు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీవో ఆఫీస్‌లో ప్రజాపాలన అధికారుల వద్ద కూడా నమోదు చేసుకోవచ్చు.

News February 15, 2025

నల్గొండ: పురుగుమందు తాగి వివాహిత సూసైడ్ 

image

మునుగోడు మండలం ఉకొండిలో కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నిమ్మల మానస(28), భర్త నగేష్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. నగేష్ శుక్రవారం మునుగోడుకు వెళ్లి తిరిగి వచ్చే సరికి మానస పురుగు మందు సేవించి వాంతులు చేసుకుంది. చికిత్స కోసం నల్గొండ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు.

News February 15, 2025

NLG: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

News February 15, 2025

జాతీయ కబడ్డీ పోటీలకు నల్గొండ జిల్లా యువతి

image

తెలంగాణ సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు హాలియా మండలం ఇబ్రహీంపేట చెందిన అయేషా ఎంపికయ్యారు. హరియాణాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన అయేషాను పలువురు అభినందించారు.

News February 15, 2025

NLG: డీసీసీబీ, PACS పదవీకాలం పొడిగింపు

image

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల కాల పరిమితిని ప్రభుత్వం పొడిగించించిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల పాటు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలే కొనసాగేలా నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని డీసీసీబీతో పాటు 107 పీఏసీఎస్ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్లు కూడా యథావిధిగా కొనసాగుతారు.

News February 15, 2025

NLG: ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే..!

image

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో స్థానిక పోరుకు ఇంకొన్నాళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు. ఎన్నికలు ఉంటాయనే వార్తల నేపథ్యంలో జిల్లాలోని 868 గ్రామపంచాయతీలలో ఆశావాహులు సిద్ధమయ్యారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనుకున్న తరుణంలో వాయిదా పడడంతో నిరాశకు గురయ్యారు.