India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పంచాయతీ కార్యదర్శుల నకిలీ హాజరును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జిల్లాలో కొందరు కార్యదర్శులు తప్పుడు పద్ధతిలో హాజరు నమోదు చేసిన విషయం తెలిసిందే. 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే వెళ్లినట్లుగా ఆ పంచాయతీలో పని చేసే కార్యదర్శుల చేత తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయించారు. వారందరికీ చార్జింగ్ మెమోలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వీరందరికీ పదోన్నతులతోపాటు ఇంక్రిమెంట్లు సైతం కట్ చేయనున్నారు.

జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.

2025-26 సంవత్సరానికి హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి జిల్లా నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ ఆలీ తెలిపారు. బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో నల్లగొండ జిల్లా విద్యార్థిని కలిమెల భావన ప్రథమ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించవద్దని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో జీవో నం. 45 ప్రకారం నిధులు వినియోగించుకోవాలన్నారు. కాలువ కట్టలు తెగే సూచనలు గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాన్నారు. విపత్తు సమయంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

జిల్లాలో రెండో విడత లైసెన్స్ సర్వేయర్ల శిక్షణను ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ (రెవెన్యూ), జిల్లా సర్వే అధికారి జి.సుజాత తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక జిరాక్స్ సెట్, ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉదయాదిత్య భవన్కు ఉదయం 11 గంటలకు చేరుకోవాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు జిల్లాలో 30 మి.మీ. సగటు వర్షం కురిసింది. దామరచర్లలో అత్యధికంగా 77.2 మి.మీ., అత్యల్పంగా నార్కెట్ పల్లిలో 2.5 మి.మీ. వర్షం కురిసింది. కనగల్ మండలంలో 42.7మి.మీ., మునుగోడు 15.5 మి.మీ., చండూరు 21.5 మి.మీ., మర్రిగూడ 48.2 మి.మీ., చింతపల్లి 13.1 మి.మీ., నాంపల్లి 32.6 మి.మీ., గుర్రంపోడు 42.5 మి.మీ., అనుములు హాలియా 23.7 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.

గుర్రంపోడులోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ జి.రాగిణి తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడ్మిషన్ కావాల్సిన వారు నేరుగా పాఠశాలకు వచ్చి ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. 9397320844 నంబర్కు సంప్రదించాలని సూచించారు.

NLG: అకాల వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నల్గొండ జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం వేములపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కార్యాలయాలను అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వరదల వలన ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.