India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్లో వీరి వివాహ జరిగింది.
FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. నకిరేకల్ MLA వీరేశం, పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వారు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది.
WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్లతో పాటు ఉపసంహరణల ఘట్టాలు పూర్తయ్యాయి. ఇక ప్రచారం జోరుగా సాగనున్నట్లు తెలుస్తోంది. బరిలో ఉండేవారు తేలడంతో నేటి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనున్నది.
ఓ డిజిటల్ పత్రిక వ్యవహారం పోలీసులకు చుట్టుకుంది. క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రిక ముసుగులో కొంతమంది అధికారులు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు.విలేకరులకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలపై తాజాగా ఓ సీఐని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేయగా.. KTGR పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.
WGL-KMM-NLG టీచర్ MLC బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. వారిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్ష వర్ధన్రెడ్డి, సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, పురుషోత్తం రెడ్డి, వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు ఉన్నారు.
జిల్లాలో కీలకమైన డీసీఎంఎస్ (జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ)ల పాలక వర్గాల పదవీకాలం విషయంలో సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. డీసీఎంఎస్ల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తారా..? లేక నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా..? అనే దానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్గా హస్తం పార్టీ నేత ఉన్నారు.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.
రేపు నల్లగొండ జిల్లా బందును విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ నాయకులు రాజు గురువారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని గురువారం మాల మహానాడు జాతీయ నాయకులు రాజు మాట్లాడుతూ.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు సంఘాలు బందుకు పిలుపునిచ్చాయని, ఈ బంధును విజయవంతం చేయాలన్నారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
Sorry, no posts matched your criteria.