India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మర్రిగూడ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ను మినీ కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.
కేజీబీవీ విద్యార్థినులు 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె కనగల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో ముఖాముఖి నిర్వహించి.. వారితో సెల్ఫీ దిగారు. పదవ తరగతిలో 10-10 జీపీఏ సాధించిన వారిని విజయవాడ, చెన్నై లాంటి పట్టణాలకు విమానంలో తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
MG యూనివర్సిటీ పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్గా డా. ఎం. రామచందర్ గౌడ్, కాంపీటేటీవ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్గా సోషల్ వర్క్ విభాగ అధిపతి, డా. ఎస్ శ్రవణ్ కుమార్ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ స్థానాల్లో సేవలు అందించనున్నారు. సహ అధ్యాపకుల నియామకం పట్ల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో చేపూరి బాబురావు (45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి సంతానంగా కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తే తండ్రికి తలకొరివి పెట్టి, కుమారుడు లేని లోటు తీర్చింది. అలాగే మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించారు. ఈ మేరకు జడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి మంగళవారం జాబితాను విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1911 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 400 మంది ఓటర్ల వరకు 145 పోలింగ్ స్టేషన్లు, 401 నుంచి 500 మంది ఓటర్ల వరకు 420 పోలింగ్ స్టేషన్లు, 501 నుంచి 750 మంది ఓటర్ల వరకు 1,346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ కలెక్టరేట్లోని ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉపసంహరించుకోవాలని, ఉపసంహరణకు ఒక్కరోజే సమయమని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 1 నామినేషన్ తిరస్కరణకు గురి కాగా 22 మంది బరిలో ఉన్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ మీసేవా కేంద్రాల్లో చేసుకోవాల్సిన అవసరం లేదని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తులను కలెక్టరేట్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం ఆన్లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కొత్త వారు, ఇంతకు ముందు దరఖాస్తు చేయని వారు మాత్రమే చేసుకోవాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్గా పోలీసులు గుర్తించారు.
నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.