India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ 3 సెకన్ల పాటు భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.
ప్రతిఒక్కరూ తమ ఊరికి మంచి రహదారి ఉండాలనుకోవడం సహజం. కానీ జుక్కల్ నియోజకవర్గ వాసులు హడలిపోతున్నారు. ఆ దారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హైవే అధికారుల నిర్లక్ష్యం, కొంత మేర వాహనదారుల నిర్లక్ష్యంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల పిట్లం వద్ద హైవే పై కారుకు గేదెలు అడ్డు రావడంతో కారు బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.
నిజామాబాద్ నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అర్బన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. 128 స్వయం సహాయక సంఘాలకు రూ. 10.52 కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 మంది సభ్యులకు కోటి రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వీధి విక్రయదారులకు స్వనిధి పథకం కింద 50 మందికి రూ. 15 లక్షల ఆర్థిక తోడ్పాటు అందించారు.
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ, కమిషనర్ శ్రీహరిడిప్యూటీ ఈఈ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు గల్ఫ్ పారిపోయిన ఘటన సిరికొండలో చోటుచేసుకుంది. SI రామ్ వివరాల ప్రకారం.. ముషీర్నగర్కు చెందిన ఓ యువతి, అక్షిత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గతవారం గల్ఫ్కు పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు యువకుడికి సహకరించిన తల్లి మల్లవ్వ, అన్న అజయ్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
HYD బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ ప్రగతినగర్లోని ఓ హాస్టల్లో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా మోపాల్కు చెందిన ప్రగన్య(18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాగా సోమవారం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లా వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జాగృతి నాయకులు షెడ్యూల్ విడుదల చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన వరుసగా సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 4న వరంగల్ మరియు, నిజామాబాద్ 5న కరీంనగర్ & నల్గొండ, 6న రంగారెడ్డి మరియు ఆదిలాబాద్, 7న హైదరాబాద్ మరియు ఖమ్మం, 8న మెదక్ మరియు మహబూబ్నగర్ లో జరగనున్నాయి
వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారు బ్రిడ్జి వద్ద రాజు(25) అనే యువకుడిని అతడి తండ్రి సాయిలు <<14765998>>హత్య<<>> చేయించిన విషయం తెలిసిందే. సీఐ తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో పాటు చెల్లెళ్లను రాజు నిత్యం వేధించేవాడు. విసిగిపోయిన సాయిలు.. అనిల్తో కలిసి ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా రాజుకు మద్యం తాగించి బైక్పై బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు.
కొడుకును కన్న తండ్రే కడతేర్చిన ఘటన KMRలో చోటుచేసుకుంది. గోసంగి కాలనీకి చెందిన సాయిలు, సాయవ్వల కుమారుడు రాజు మద్యానికి బానిసయ్యి కుటుంబీకులను వేధించేవాడు. వేధింపులు తాళలేక సాయిలు పట్టణానికి చెందిన అనిల్తో కలిసి పథకం ప్రకారం నవంబర్ 29న రాజును ఉగ్రవాయి శివారులోకి తీసుకెళ్లి చంపేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని నిందితులుగా గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసినట్లు CI రామన్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.