Nizamabad

News November 29, 2024

నిజామాబాద్: SGF హాకీ టోర్నమెంట్ పరిశీలకుడిగా స్వామి కుమార్

image

ఎస్జీఎఫ్ అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు హుజూరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరుగనున్నాయి. కాగా.. టోర్నీ పరిశీలకుడిగా జడ్పీహెచ్ఎస్ జాకోరా, వర్ని పీఈటీ డాక్టర్ స్వామి కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై ఎస్జీఎఫ్ సెక్రెటరీ నాగమణి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు, సీనియర్ హాకీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

News November 28, 2024

ఆర్మూర్‌లో విషాదం.. డ్రైనేజీలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

image

ఆర్మూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి డ్రైనేజీలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన ఆర్మూర్ లో గురువారం జరిగింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాంనగర్లో ఉదయం మట్ట ధనస్వి(4) చిన్నారి ఆడుకుంటూ ఇంటి ఎదుటే ఉన్న డ్రైనేజీల్లో పడిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు రెండు గంటలపాటు కాలనీ అంతా వెతికినా దొరకలేదు. చివరికి డ్రైనేజీల్లో చిన్నారి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.

News November 28, 2024

BRS నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్

image

టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ BRS నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే దిలావర్పూర్‌లోని ఇథనాల్ పరిశ్రమ గురించి ముఖాముఖి చర్చకు రమ్మన్నారు. ఫ్యాక్టరీకి BRS ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ ఆ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఫ్యాకర్టీ గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు.

News November 28, 2024

NZB: ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై ఫోక్సో కేసు: ఎస్సై

image

బాలికను ప్రేమ పేరుతో వేధించిన ఓ యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్ కు చెందిన ఓ యువకుడు నాలుగో టౌన్ పరిధికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తెలపగా.. నాలుగవ టౌన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

News November 28, 2024

మాజీ జడ్పీటీసీ మృతి పట్ల పోచారం సంతాపం

image

కోటగిరి మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శివరాజ్ దేశాయ్ శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ పలు పదవుల్లో కొనసాగారు. రోడ్డు ప్రమాదంలో శివరాజ్ దేశాయ్ మృతి చెందారని వార్త తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటినా సంగారెడ్డి ఆసుపత్రికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

News November 27, 2024

బోధన్: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద హైవే- 161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్‌కు చెందిన ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బోధన్‌కు చెందిన దేశ్ ముక్ రాజశేఖర్, తండ్రి శివరాజ్, తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి భార్య అరుణ, కూతురు అనన్యతో కలిసి కారులో HYD నుంచి బోధన్‌కు వెళ్తున్నారు. అల్లాదుర్గం వద్ద కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న రాజశేఖర్, తండ్రి శివరాజ్ మృతి చెందారు.

News November 27, 2024

భిక్కనూరు: ‘మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలి’

image

దేశంలో ఉన్న మాలల సమస్యల పరిష్కారం కోసం, డిసెంబర్ 1వ తేదీ సికింద్రాబాద్ ఫేరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మాలల సింహ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని మాలల సంఘ జిల్లా నాయకుడు నర్ముల రామచంద్రం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సింహ గర్జన ద్వారా మాలలు సత్తా చాటాలన్నారు.

News November 27, 2024

ఎడపల్లి: మళ్లీ రెచ్చిపోయిన శునకాలు.. ముగ్గురికి గాయాలు

image

ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంపులో శునకాలు రెచ్చిపోతున్నాయి. పక్షం రోజుల్లోనే ఆరుగురిపై దాడికి పాల్పడి విచక్షణ రహితంగా గాయపర్చాయి. తాజాగా మంగళవారం గ్రామానికి చెందిన అబ్దుల్ సోఫి అనే యువకుని పై శునకం దాడి చేసి నోటి కింద పెదవిని కొరికివేసింది. అలాగే ఓ పసి బాలునిపై, ఓ బాలికపై దాడి చేసి గాయపర్చాయి. కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కుక్కల బెడద నుంచి జనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

News November 27, 2024

ఫుడ్‌పాయిజన్‌ కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం: కవిత

image

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ జరగడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ వేదికగా స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం తిని బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా తన మనసు కలచి వేసిందన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు.

News November 26, 2024

నిజామాబాద్: భార్య, కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్

image

న్యాల్కల్ మాసాని చెరువులో కూతురితో కలిసి తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. NZBకి చెందిన కాంత్రికుమార్‌కు ఇద్దరు కుమార్తెలు. కాగా, తన 18 నెలల కూతురు నేహశ్రీ మానసిక అనారోగ్యంతో రెండు సార్లు ఆపరేషన్ చేయించాడు. అయినా కుదుట పడకపోవడంతో మనస్తాపం చెంది నేహశ్రీతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య, చిన్న కూతురు సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.