Nizamabad

News August 14, 2024

నేటి నుండి యూత్ కాంగ్రెస్ ఎన్నికలు..

image

NZB: నేటి నుంచి జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు మొదలు కానున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున దీనికి త్రీవ్ర పోటీ నెలకొంది. నేటి నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 14 వరకు కాంగ్రెస్ కి సంబంధించిన అప్లికేషన్(WITH IYC) లో ఓటు వేయాలని జిల్లా కాంగ్రెస్ యూత్ విభాగం తెలిపింది. ఇందులో జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయికి సంబంధించిన అభ్యర్థులు పోటీ పడతారు.

News August 14, 2024

బంగ్లాదేశ్‌లో దాడులను నిరసిస్తూ నేడు నిజామాబాద్ నగర బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ బంద్‌‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ హిందూ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నగరంలో ఉన్న వివిధ మర్చంట్ సంఘాల నాయకులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.

News August 14, 2024

నవీపేట్: ఇసుక అక్రమ రవాణా.. రూ. 20,000 జరిమానా

image

నవీపేట్ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను తహశీల్దార్ నారాయణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. రెంజల్ మండలం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. టిప్పర్ యజమానికి మంగళవారం రూ.20వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా మొరం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తాసిల్దార్ నారాయణ తెలిపారు.

News August 13, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు
* NZB: పోలీస్ స్టేషన్ లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
* బాన్సువాడ ఉప ఎన్నిక ఖాయం: KTR
* లింగంపేట్: యువకుడిపై ఎలుగు బంటి దాడి
* నిజామాబాద్ కు జిల్లాకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి పొన్నం
* పిట్లం: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
* పోతంగల్: రాత్రి అక్రమ ఇసుక సీజ్.. ఉదయం ఇసుక మాయం
* లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE.. ఏడాది జైలు శిక్ష

News August 13, 2024

బాన్సువాడలో ఉపఎన్నిక ఖాయం: KTR

image

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని బీఆర్ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారంను ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు.

News August 13, 2024

BREAKING.. NZB: పోలీస్ స్టేషన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై గదిలో ఎస్సై లేని సమయంలో రమేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తి ఎస్సై ఛాంబర్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడినా అక్కడి సిబ్బంది పట్టించుకొకపోవడం గమనార్హం.

News August 13, 2024

NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు..!

image

దత్తత తీసుకున్న ఓ పదేళ్ల బాలుడిని దారుణంగా హింసిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని రాకాసిపేట్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ జంట ఏడేళ్ల క్రితం ఎండీ ఫరీదుద్దీన్‌ను దత్తత తీసుకున్నారు. కొన్ని రోజులుగా వారి ఇంటి నుంచి అరుపులు కేకలు వినిపిస్తుడంతో స్థానికులు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి వెళ్లి బాలుడిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. తనను హింసిస్తూ ఇంట్లో పనులు చేయిస్తున్నారని బాలుడు ఆరోపించాడు.

News August 13, 2024

లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE ..సంవత్సరం జైలు శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో NPDCL మాక్లూర్ AAE మచ్చ సదాశివకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి ACB కోర్టు సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పు చెప్పారని ACB నిజామాబాద్ DSP తెలిపారు. 2008లో మదనపల్లిలో కొత్త ట్రాన్స్ ఫార్మర్, కనెక్షన్లను ఏర్పాటు కోసం సదాశివ 5 వేలు డిమాండ్ చేసి రూ.3 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

News August 13, 2024

NZB: ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏజెంట్లను నియమించనున్నట్లు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాలకు ఆర్మూర్-73968 89496, బోధన్- 90142 96638, నిజామాబాద్-1 91542 98727, నిజామాబాద్-2 73968 89496, బాన్సువాడ 91542 98729, కామారెడ్డి 91542 98729 సంప్రదించాలని సూచించారు.

News August 13, 2024

SRSP అప్‌డేట్: స్వల్పంగా పెరిగిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో పెరిగింది. గడిచిన 24 గంటల్లో యావరేజ్‌గా 6,375 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరిందని, మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 4,083 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80TMC)కు గాను ప్రస్తుతం 1080.90 అడుగుల (47.548TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.

error: Content is protected !!