Nizamabad

News November 22, 2024

NZB: సొంత చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న

image

నిజామాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. సొంత చెల్లెలిపై అన్న పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓ టౌన్ పరిధికి చెందిన బాలికపై(17) సొంత అన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం బాలిక తండ్రికి తెలియడంతో అతడు 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

News November 22, 2024

NZB: రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ: కలెక్టర్

image

సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని వివరించారు.

News November 22, 2024

డిసెంబర్ 7లోపు మంత్రి వర్గ విస్తరణ..! NZB నుంచి ఎవరికి ఛాన్స్?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సందర్భంగా డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవీ దక్కుతుందో ఉత్కంఠ నెలకొంది. కాగా మంత్రి పదవీ రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.

News November 22, 2024

జుక్కల్: న్యూ MLA.. న్యూ ట్రెండ్..!

image

జుక్కల్‌కి కొత్తగా పరిచయమై, హ్యాట్రిక్ వీరుడు మాజీ MLA హన్మంత్ షిండేను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన తోటలక్ష్మీకాంత్ రావు జుక్కల్ రాజకీయాల్లో చరిత్రను తిరగ రాశారు. రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా AMC ఛైర్మన్ల నియామకాల్లో ఇంటర్వ్యూ నిర్వహించి కొత్త ఒరవడిని సృష్టించి మరోసారి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నారు. మంత్రులు, ప్రముఖులు సీఎం సైతం శభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.

News November 22, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

నవీపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-17 విభాగంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 38 మంది బాలికలు, 28 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ఐదుగురు బాలికలు, 8మంది బాలురు ఈ నెల 23 నుంచి 25వ తేది వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్రస్థాయి  పోటీల్లో పాల్గొనడానికి ఎంపిక అయ్యారు.

News November 21, 2024

KMR: అధికారులతో కలెక్టర్ వీడియో సమీక్ష

image

కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.

News November 21, 2024

నిజామాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది కానిస్టేబుళ్లు 

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News November 21, 2024

ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం మద్నూర్ ఛైర్మన్ ఎన్నిక: CM

image

మద్నూర్ AMC ఛైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై CM రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ మహిళల చదువుకు ఆత్మస్థైర్యానికి ప్రోత్సహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని’ సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన MLA తోట లక్ష్మీకాంత్ రావు, సహచర మంత్రి వెంకటరెడ్డి, TPCC చీఫ్ మహేశ్ గౌడ్‌లకు అభినందనలు తెలిపారు.

News November 21, 2024

ఆర్మూర్: మహిళను వేధించాడు.. చివరికి అరెస్టయ్యాడు.!

image

మహిళను వేధిస్తున్న ఒకరిని షీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఓ మహిళ ఫోన్‌కి ఒక వ్యక్తి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ, అసభ్యకర సందేశాలను పంపుతూ ఆమెను వేధిస్తున్నాడు. దీంతో సదరు మహిళ షీటీంకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంటనే ఆర్మూర్ షీటీం సభ్యులు అతడిని పట్టుకున్నారు. తదుపరి చర్యలకై అతడిని ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

News November 21, 2024

NZB: ‘బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలి’

image

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. పిల్లల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలని తెలిపారు.