India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజాంసాగర్ మండలంలో సోమవారం జాతీయ రహదారి 161లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్రావుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 161లో హైదరాబాదు నుంచి పిట్లం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
బీర్కూర్ మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పట్టాదారు పుస్తకం ఇవ్వకుండా RI ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పెద్ద కొడప్గల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. వడ్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య గత కొన్ని నెలల కిందట పట్టాదారు పాసు పుస్తకం కోసం RI పండరికి రూ.20 వేలు చెల్లించిన్నట్లు బాధితుడు తెలిపాడు. కాగా, ఈరోజు ప్రజావాణిలో పురుగు మందు తాగాడు. అధికారులు అడ్డుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హరిఫ్ HYDలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రతి ఇంటా భగవద్గీత ఉండాలన్న ఉద్దేశంతో ఓ కుటుంబం తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా ముద్రించి పంపిణీ చేస్తోంది. వివరాలిలా.. కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన వ్యాపారవేత్త కోట నాగమణి, రాజులు దంపతుల కూతురు వివాహం ఈనెల 23న జరగనుంది. వారు శుభలేఖను భగవద్గీతలోని మొదటి పేజీలో ముద్రించి అందిస్తున్నారు. ఈ శుభలేఖ అందరినీ ఆకర్షిస్తోంది.
ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ 1 ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక గోశాల రోడ్డులోని నీటికాలువ గట్టున ఉన్నచెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి(42) ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 10రోజుల కిందట ఆత్మహత్య చేసుకొని ఉంటాడని, మృతదేహం కుళ్లిపోయిందని తెలిపారు. వ్యక్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో ఎనిమిది మంది వరకు కుక్కల దాడిలో గాయపడ్డారు. వారం క్రితం బోధన్ పట్టణంలో ఆరుగురు వీధి కుక్కల బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లాలో సైతం ఎల్లారెడ్డి బీర్కూరు బాన్సువాడ కామారెడ్డి లలో పలువురు గతంలో వీధి కుక్కల బారిన పడ్డారు. ఈ సమస్యను నివారించాల్సిన అవసరం ఉంది.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నేడు బాన్సువాడ బంద్ కు పిలుపునిచ్చినట్లు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. విద్యార్థుల ఆందోళన ముసుగులో హిందువులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. బంద్కు విద్య, వ్యాపార సంస్థలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి 1గంట వరకు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
*నిజామాబాద్లో అంబరాన్నంటిన బంజారా తీజ్ ఉత్సవాలు
*NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
*రైల్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత
*షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్
*ఆర్మూర్: పిచ్చికుక్కల దాడి.. ఏడుగురికి గాయాలు
*భార్య కళ్ళ ముందే భర్త ఆత్మహత్య
*రుద్రూర్: నూతన గ్రామ పంచాయతీగా కొండాపూర్
*నిజాంసాగర్:చెరువులో పడి యువకుడు మృతి
Sorry, no posts matched your criteria.