Nizamabad

News May 13, 2024

‘మద్నూర్‌‌లో ఉ.8 గంటల వరకు ఓట్లు నమోదు కాలేదు’

image

మద్నూర్ మండలంలోని మూడో వార్డులో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 8 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని అధికారుల తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో టెక్నీషియన్ల సాయంతో వాటిని బాగు చేయించి ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు.

News May 13, 2024

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

image

బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డిలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రణీత్, రిషికేష్, శివాజీ బైక్‌పై తమ పొలం వైపు వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్ వచ్చి ఢీకొంది. దీంతో ప్రణీత్ (12) అక్కడికక్కడే మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 13, 2024

NZB: ఓటు వేయాడానికి ఇవి తప్పనిసరి..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవడానికి కిందివాటిలో ఏదైనా ఒక ఐడీ కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్, ఫొటోతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్ పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు వెయవచ్చు.

News May 13, 2024

NZB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 68.44 శాతం పోలింగ్ నమోదవగా జహీరాబాద్ నియోజకవర్గంలో 69.70 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 12, 2024

KMR: భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన కానిస్టేబుల్

image

భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రామారెడ్డిలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కట్ట బాబు అతని భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రావడం లేదనీ మనస్తాపం చెంది, మద్యం సేవించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా.. అది చూసిన కానిస్టేబుల్ రంజిత్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని కాపాడాడు.

News May 12, 2024

మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు..!

image

HYD పరిధి హయత్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారనే ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ ఇంట్లో తనిఖీలు చేపడుతోంది. తనిఖీల్లో భాగంగా కాంగ్రెస్ నేత ఇంటి పరిసరాల్లో ఉన్న వారితో మాట్లాడి, డబ్బు పంపిణీపై ప్రత్యేక బృందం ఆరా తీసింది. రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం అధికారులు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు.

News May 12, 2024

NZB: కూతురు ఆశయాన్ని కొనసాగిస్తున్న తల్లి

image

NZB జిల్లా కొటగిరికి చెందిన వెంకటమ్మ కూతురిని కోల్పోయిన అమ్మ అనే పిలుపునకు దూరం కాలేదు. ఆమె కూతురు పావని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన వైకల్యాన్ని లెక్కచేయకుండా పావని 18 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. 2018లో పావని మృతి చెందింది. వెంకటమ్మ 70 ఏళ్ల వయస్సులో తన కూతురి ఆశాయాన్ని ముందుకు తీసుకెళ్తోంది. వారిని చదివిస్తూ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు యువకులు ఆర్మీలో చేర్పించింది.

News May 12, 2024

NZB: ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఉంటుందా..?

image

NZB పార్లమెంట్ స్థానంలో పసుపు బోర్డు MP అభ్యర్థుల ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 182 మంది MP ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి చరిత్ర సృష్టించారు. కాగా ఈ ఏడు పసుపునకు దేశంలోనే రికార్డు ధర పలికింది. మరి ఈ ఎన్నికల్లో పసుపు బోర్డు ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో చూద్దాం.

News May 12, 2024

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు

image

ఈ నెల 13 న జరిగే లోక సభ పోలింగ్ కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయుటకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఓటర్లు వంద శాతం పోలింగ్ లో పాల్గొనాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి వీలుగా 913 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 64 సమస్యాత్మక లొకేషన్లలో 183 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు.

News May 11, 2024

NZB: నడిరోడ్డుపై కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ

image

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత మునిపల్లి సాయిరెడ్డికి ఇందల్వాయి మండల ప్రచార బాధ్యతలు అప్పగించగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనల మేరకు ఆయన శనివారం మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గౌరారం గ్రామానికి చెందిన సంతోష్‌తో గొడవ జరిగింది. మా ఇలాకాలో మీ పెత్తనం ఏంటని? సాయిరెడ్డిపై సంతోష్ నడిరోడ్డుపై గొడవకు దిగారు.