India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ఆమెకు బెయిల్ వస్తుందా? లేదా? అనే చర్చ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది. ఇదే కేసులో 2 రోజుల క్రితం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా తీహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు అయిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్వో నరేందర్ కు ఏసీబీ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం నరేందర్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు శనివారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించగా నరేందర్ ను జైలుకు తరలించారు.
ఎండు గంజాయిని సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టివిఎస్ వాహనంపై ఎండు గంజాయిని తీసుకుని వెళ్తున్న షేక్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 465 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో దిలీప్, ఎస్సై మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్కు ‘ట్విట్టర్ X’ వేదికగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ పోస్టులో అమన్ సెహ్రావత్ జాతీయ జెండా పట్టుకున్న ఫోటోను జత చేసిన ఎంపీ అరవింద్ ‘భారత్ మరో ఘనతను చాటుకుంది. ఒలంపిక్స్ పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినందుకు అమన్ సెహ్రావత్కు అభినందనలు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కోటగిరి మండలంలో కొత్తగా 8 పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి మండలంలో ఇప్పటి వరకు 28 పంచాయతీలుండగా ఆ సంఖ్య 36కు చేరింది. ఎత్తొండ క్యాంపు, ఎక్లాస్పూర్ క్యాంపు, శ్రీనివాస్ రెడ్డి కాలనీ, బాకర్ ఫారం, జల్లాపల్లి పాత గ్రామం, జల్లాపల్లి తండా, తిర్మలాపూర్, రాంగంగానగర్ కొత్తగా ఏర్పడ్డాయి.
టాస్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 75కి పైగా కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో 45వేల మంది వరకు తమ పేర్లను టాస్క్ వద్ద నమోదు చేసుకున్నారు. అందులో 5 వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. టాస్క్ ఆధ్వర్యంలో కళాశాలల్లో విద్యార్థులకు శిక్షణ ప్రాంగణ నియామాకాలు చేపడుతున్నట్లు టాస్క్ ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభానికి RTC అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులు చేరుకున్నాయి. శుక్రవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కొన్ని పనులు మిలిగి ఉండటంతో ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా వేశారు. బస్సులకు ఛార్జింగ్ పెట్టడానికి 11 ఛార్జింగ్ పాయింట్లు పూర్తయ్యాయి. జిల్లాకు 65 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయని అర్టీసీ అధికారులు ప్రకటించారు.
న్యూ ఢిల్లీలో జరిగే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం రావడం తెలంగాణ యూనివర్సిటీకి గర్వకారణం అని రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి పేర్కొన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కె.విజయ శాంతి, జ్యోతి, శివప్రసాద్, సాయిరాంకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని రిజిస్ట్రార్ తన కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కొండ రవీందర్ రెడ్డి, చంద్రకళ, సురేష్ పాల్గొన్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1389.73 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 932 టీఎంసీలుగా ఉంది. కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.50 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం అంతే స్థాయిలో 416.550 మీటర్లుగా ఉంది.
నిజామాబాద్ జిల్లాలో పలువురు ఎస్సైలకు స్థానచలనం కలిగిస్తూ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ -1 పరిధిలోని 40 మంది ఎస్సైలకు స్థాన చలనం చేస్తూ ఉత్తర్వులు వెలువడగా ఎం.డి. యాసర్ అరాహత్ను 2వ టౌన్ ఎస్హెచ్వోగా అక్కడ పని చేస్తున్న రాంను సిరికొండ ఎస్ హెచ్ఓగా బదిలీ చేశారు. 3వ టౌన్ ఎస్సై ప్రవీణ్ ను ఆదిలాబాద్ జిల్లాకు శ్రీకాంత్ 4వ టౌన్ ఎస్ హెచ్ వోగా బదిలీ చేశారు.
Sorry, no posts matched your criteria.