Nizamabad

News August 9, 2024

ఉమ్మడి NZB జిల్లాల్లో నేటి ముఖ్యాంశాలు

image

* NZB: మున్సిపల్ అధికారి ఇంట్లో ACB సోదాలు
* మద్నూర్: కొడుకు చేతిలో తండ్రి హతం.. నిందితుడికి రిమాండ్
* NZB: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
* KMR: చిల్డ్రన్స్ పార్క్ ను ప్రారంభించిన SP సింధుశర్మ
* జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
* NZB: పోలీస్ కస్టడీకి యునియన్ బ్యాంక్ మేనేజర్
* జిల్లాలో వణికిస్తున్న వైరల్ ఫీవర్స్.. నిజామాబాదిలు జాగ్రత్త
* NZB: విద్యుత్ శాఖ అధికారుల పోలం బాట

News August 9, 2024

పాత పోతంగల్: చెరువులో వృద్ధురాలి మృతదేహం

image

పోతంగల్ మండలం పాత పోతంగల్ చెరువులో శుక్రవారం గోవుర్ గంగవ్వ (65)అనే వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. గంగవ్వ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాద వశాత్తు చెరువులో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మృతురాలి కొడుకు గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

News August 9, 2024

NZB: వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

image

నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోతున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు 222 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. TGలో డెంగ్యూ కేసుల్లో NZB 3వ స్థానంలో ఉంది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది.

News August 9, 2024

KMR: టౌన్ పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్‌ను జిల్లా SP సింధు శర్మ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా SPమాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సారిగా, ఎక్కడా లేని విధంగా పట్టణ పోలీసు స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన పట్టణ SHO చంద్ర శేఖర్ రెడ్డిని అభినందించారు.

News August 9, 2024

NZB: మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

image

నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ పై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదును, ఆయన భార్య బ్యాంకు అకౌంట్లో రూ.1.10 కోట్ల నగదు ఉన్నట్లు తేల్చారు. అలాగే అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ గుర్తించింది.

News August 9, 2024

మద్నూర్‌: హత్య కేసులో నిందితుడికి రిమాండ్

image

మద్నూర్‌లో తండ్రిని చంపిన ఘటనలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బిచ్కుంద CI నరేష్ వివరాలు.. మద్నూర్ వాసి అర్జున్ (64) ఇటీవల తన పొలంను విక్రయించాడు. ఈ క్రమంలో కొడుకు బైక్ కొనుగోలు కోసం తండ్రైన అర్జున్ వద్ద డబ్బులు అడిగాడు. నిరాకరించడంతో కోపంతో వెంకట్ కర్రతో అర్జున్ తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడు. కేసు విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 9, 2024

NZB: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ న్యూగంజ్ ప్రాంతంలో ఇంట్లో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిహార్‌కు చెందిన రాణీ దేవి (35) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి న్యూ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీచందన్ దాస్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News August 9, 2024

NZB: పోలీస్ కస్టడీకి యూనియన్ బ్యాంక్ మేనేజర్

image

ఖాతాదారులతో పాటు బ్యాంకును మోసగించిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిజామాబాద్ యూనియన్ పెద్ద బజార్ బ్యాంకు మేనేజర్ అజయ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పోలీసు కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించగా శుక్రవారం ఉదయం పోలీసులు జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 42 మంది బాధితుల నుంచి సుమారు రూ.4 కోట్ల మేర మేనేజర్ తీసుకున్నట్లు ఆరోపణల మేరకు విచారించేందుకు కస్టడీకి తీసుకున్నారు.

News August 9, 2024

NZB: ఏసీబీ దాడుల్లో భారీగా బంగారం, నగదు గుర్తింపు?

image

NZB అశోక్ టవర్స్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జ్ ఆర్వో నరేందర్ ఇంట్లో శుక్రవారం జరుగుతున్న ఏసీబీ సోదాల్లో భారీగా బంగారం, నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు నరేందర్ ఉంటున్న ఇంటితో పాటు కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లీ, నిర్మల్‌లోని బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

News August 9, 2024

NZB: మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది మున్సిపల్ వర్గాల్లో కలకలం రేపింది. రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్, ఇంఛార్జి ఆర్వో నరేందర్ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారుల బృందం మెరుపు దాడి చేసింది. ఆదాయానికి మించిన అస్తులున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

error: Content is protected !!