India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం ప్రారంభించారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ క్యాష్ ఆన్ డెలివరీ’ పేరిట వాట్సాప్ గ్రూపు నడుపుతూ డైరెక్ట్గా కంపెనీల నుంచి వస్తువులు తక్కువ ధరకే మీ ఇంటికే వస్తాయని నమ్మిస్తున్నారు. బ్రాండ్ల పేరిట ఆర్డర్లు తీసుకుని నాసిరకం బట్టలు పంపుతున్నారని ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు.
నిజామాబాద్ ముబారక్నగర్లోని సాయి అటాకరి అపార్ట్మెంట్లో రాత్రి నలుగురు చిన్నారులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. మూడో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు చిన్నారులు లిఫ్ట్ ఎక్కగా.. లిఫ్టుకు ఉన్న రెండు తీగల్లో ఒకటి తెగిపోయి కిందకు జారింది. మరో తీగ లిఫ్టు పై ఉన్న రింగులో చిన్నారులు చిక్కుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆపార్ట్మెంట్ వాసులు వెంటనే లిఫ్ట్ మరమ్మతులు చేయించి పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు.
బంధువులు చనిపోవడంతో గురువారం అంత్యక్రియలకు వెళ్లగా దొంగలు ఇంట్లో చొరబడి 3తులాల బంగారం అపహరించుకుపోయిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో జరిగింది. సంజీవ్ రెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణ బంధువులు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సరికి చోరీ జరిగింది. ఈ మేరకు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
*కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
*మద్నూర్: బైక్ కొనివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
*NZB: బెల్ట్ షాపులను ఎత్తివేయాలని నిరాహార దీక్ష.. కృపా జ్యోతి అరెస్ట్
*జిల్లాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు
*NZB: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
*నాగిరెడ్డిపేట్: వన సేవిక రామయ్యను సన్మానించిన కలెక్టర్
*నిజామాబాద్: TU పరీక్షల షెడ్యూల్ విడుదల
ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ KMR కోర్టు గురువారం తీర్పు నిచ్చింది. మేంగారం వాసి తలారి సాయిలు తన పొలం చుట్టూ అమర్చిన కరెంట్తో చౌల దత్తు మృతి చెందాడు. అనుమానం రాకుండా ఆ మృతదేహాన్ని చెరువులో పడేశాడు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కామారెడ్డి జిల్లా జడ్జి లాల్ సింగ్ ఈ మేరకు తీర్పును వెలువరించారు.
TU పరిధిలోని పీజీ 2వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, BLISC 2వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ KMR కోర్టు గురువారం తీర్చునిచ్చింది. లింగంపేట మండలానికి చెందిన గుడ్డేల రాములు అదే మండలానికి చెందిన బాలిక(8)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2018 జులై 8న పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి లాల్ సింగ్ నిందితుడికి జైలు శిక్ష విధించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే ఇప్పటివరకు వర్షాలు తక్కువగానే కురిశాయని అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు కుంటలు కలిపి 2,500 వరకు ఉండగా, 600 చెరువులలో 75% అంతకుమించి నీరు చేరాయి. మిగతా చెరువులు కుంటల్లో నీరు అంతగా చేరలేదు. కామారెడ్డిలో 141 చెరువుల్లో, నిజామాబాద్ జిల్లాలో 431 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పడుతున్నాయి. మిగతా చెరువులో నామమాత్రంగా నీరు చేరింది.
తూప్రాన్లో గత నెల 9న రాజధాని ఎక్స్ప్రెస్ రూ. 5 లక్షలు దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. మసాలాల వ్యాపారం చేసే నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి బస్సులో వెళ్తుండగా అతని వద్ద ఉన్న రూ. 5 లక్షలు చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన సూరజ్ డికోలే, సంతోశ్ డికోలే (39), అర్జున్ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్ప్లే పిక్చర్ వినియోగిస్తూ డబ్బులు పంపాలని కలెక్టరేట్ ఏటీఓకు మెసేజ్ చేశారు. కలెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మసూర్.. కలెక్టర్ పేరిట దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.