India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికల ప్రచారం 3 రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రాల్యీలు, రోడ్డు షోలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ ప్రసంగాలకు పదును పెడుతున్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో BC ఓట్ల బ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉంటుంది. దీంతో BC కులాలపై 3 పార్టీలలు ప్రదానంగా ఫోకస్ పెట్టాయి.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా వస్తున్నారు. ఆర్మూర్లో సాయంత్రం 5 గంటలకు, నిజామాబాద్ నెహ్రూపార్క్ చౌరస్తాలో రాత్రి 7గంటలకు నిర్వహించే కార్నర్ సమావేశాల్లో ప్రసంగిస్తారు. అంతకు ముందు గోల్హమ్మన్ చౌరస్తా నుంచి ఆర్యసమాజ్, పెద్దబజార్, ఆజాం రోడ్డు, పోస్టాఫీస్ మీదుగా నెహ్రూపార్క్ వరకు రోడ్డు షో ఉంటుంది. సీఎం ఇప్పటికే రెండు సార్లు పర్యటించగా ఇది మూడోది.
BRS అధినేత, మాజీ సీఎం KCR రోడ్ షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ZHB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షో, బస్సు యాత్ర పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసే వరకు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.
తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ కామారెడ్డి అని మాజీ సీఎం KCR అన్నారు. కామారెడ్డిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆనాడు కష్టపడి అనేక ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. BRS పాలనలో రాష్ట్రాన్ని పొదరిల్లులా చేసుకున్నామని పేర్కొన్నారు. ఇదే కామారెడ్డిలో పోలీస్ కిష్టయ్య పిస్టల్తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డికి వస్తున్న కేసీఆర్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ టీ స్టాల్లో టీ తాగి పకోడి తిన్నారు.
ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచార వాహనాలు వీధుల్లో తిరుగుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. మే 13న పోలింగ్ ఉన్నందున 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాలి. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు మైకులు కట్టేయాలి. ఎన్నికల నిబంధనలు ఎవరైనా విస్మరిస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది.
ఎంపీ ఎన్నికల్లో మహిళలు కీలకం కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో మహిళల ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ (U)లో మెుత్తం 3,04,317 మంది ఓటర్లుండగా అందులో మహిళలు 1,57,519 మంది ఓటర్లున్నారు. నిజామాబాద్ (R)లో 1,36,618, బాల్కొండలో 1,22,068, బోధన్లో 1,16,719, ఆర్మూర్ 1,13,401, బాన్సువాడలో 1,03,051 మంది మహిళా ఓటర్లున్నారు.
ఉమ్మడి NZB జిల్లాలో కొంతమంది నాయకులు MPగా పోటీ చేసి ఓడిపోగా తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి 1989లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 1994లో MLA గ గెలుపొందారు. 2009లో బిగాల గణేశ్ గుప్తా NZB ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 2019లో ZHB ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి 2023 ఎన్నికల్లో MLAగా గెలుపొందారు.
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రానికి చెందిన మహేశ్ (30) అనే వ్యక్తి బీర్కూర్ శివారులోని బండగల్లీలో గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మహేష్ నిత్యం భార్యతో గొడవ పడేవాడని, ఈనెల 2న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు. పాడుబడ్డ బావిలో మహేష్ మృతదేహాన్ని గుర్తించామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కోటగిరి మండలం ఎత్తొండలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య (50)భార్య లక్ష్మికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న నాగయ్య ముక్కు, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చింది.
Sorry, no posts matched your criteria.