India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్, మద్నూర్, మహ్మద్ నగర్, పెద్దకొడపల్, జుక్కల్, నిజాంసాగర్, డోంగ్లీ మండలాల్లో ఉన్న 28 రేషన్ దుకాణాలకు డీలర్లను భర్తీ కోసం 311 దరఖాస్తులు వచ్చాయని బాన్సువాడ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. ఈనెల 9న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు దారులు గమనించాలని కోరారు.
బాలికను అపహరించిన కేసులో బోధన్కు చెందిన 3వ వార్డు <<13791540>>కౌన్సిలర్ <<>>రాధాకృష్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై మంగళవారం పోలీసులు బాలిక అపహరణ, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. కాగా గతేడాది అతడి సోదరుడు రవికుమార్ పై బోధన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. తాజాగా బాధితురాలి కుటుంబీకులను బెదిరించడంతో మళ్లీ అతడిపై పోక్సో కేసు నమోదైంది. వారిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు డిమాండ్ చేశారు.
నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ పక్కనే ఉన్న మాల్లో ఓ యువతి పట్ల పదహారేళ్ల బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిఫ్టులో నుంచి బయటకు వెళ్లే సమయంలో యువతి చేయి పట్టుకుని లాగాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా సదరు యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు బాలుడికి మతిస్థిమితం బాగాలేదని గుర్తించారు.
నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చి చూసేసరికి రెండు ట్యాబ్లు చోరీకి గురైనట్లు ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో స్థానిక రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలోనూ ఉన్నత పాఠశాలలో దొంగతనం జరుగగా సామగ్రి చోరీకి గురైంది.
* BSWD: లైటు విషయంలో గొడవ.. అన్నను హత్య చేసిన తమ్ముడు* బోధన్: బాలికపై కౌన్సిలర్ అత్యాచార యత్నం* పిట్లం: వందల్లో రోగులు.. ఒక్కరే వైద్యుడు * జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి * బాన్సువాడ : బుడ్మీ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కిడ్నాప్* బిచ్కుంద: ఇసుక అక్రమ మైనింగ్ పై హైకోర్టు నోటీసులు* కాశీలో బాన్సువాడకు చెందిన భక్తురాలి మృతి* NZB: కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేస్తే రూ. 96 వేలు మాయం
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిన సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ను ఈరోజు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎస్సీ వర్గీకరణ అని, పోరాడి తెచ్చిన మనిషి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు.
బాలికపై ఓ కౌన్సిలర్ అత్యాచారానికి యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వార్డు కౌన్సిలర్ బాలికతో సోమవారం రాత్రి తన కారులో అనుమానాస్పదంగా కనిపించాడు. బాలిక భయంతో ఉండడాన్ని గుర్తించిన యువకులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అత్యాచారానికి యత్నించినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాశీ దర్శనానికి వెళ్లిన బాన్సువాడకు చెందిన భక్తురాలు మంగళవారం మృతి చెందారు. బాన్సువాడ పట్టణంలోని దివంగత కందగట్ల రాజమౌళి సతీమణి సరోజనమ్మ ఇటీవల భక్తులతో కలిసి కాశీ పుణ్యక్షేత్రం వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల భక్తులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా గత 6 నెలల క్రితం కూడా బాన్సువాడకు చెందిన రమేష్ అనే భక్తుడు కాశీలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఇంట్లో లైటు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి ఆవేశంలో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన బాన్సువాడలోని దాల్మల్ గుట్టలో జరిగింది. వకీల్ కృష్ణ(40), వకీల్ రాజు అన్నదమ్ముళ్లు. సోమవారం రాత్రి లైటు విషయంలో గొడవతో రాజు అన్న కృష్ణపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. మెడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆస్పత్రికి తరలించేలోపు కృష్ణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గల్ఫ్ దేశంలోని రియాద్ ప్రాంతంలో కామారెడ్డి మండలం షబ్దిపూర్ గ్రామానికి చెందిన మున్నా అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ ఏడాదిగా జీతం ఇవ్వకపోవడంతో తినడానికి తిండి లేక అల్లాడుతున్నాడు. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందిన స్వగ్రామానికి రాలేకపోయారు. తమను స్వగ్రామానికి పంపించాలని అక్కడ పలువురిని సెల్ఫ్ వీడియో ద్వారా వేడుకుంటున్నాడు.
Sorry, no posts matched your criteria.