Nizamabad

News May 5, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంబదాస్(30) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. భార్య రజిత 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ నిరేశ్ కేసు నమోదు చేశారు.

News May 5, 2024

రేపు నిజామాబాద్ జిల్లాకు KCR రాక: వేముల

image

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా BRS అధినేత KCR సోమవారం నిజామాబాద్‌‌కు రానున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా నిర్వహించే రోడ్ షో, భారీ భహిరంగ సభలో KCR పాల్గొంటారని పేర్కొన్నారు.

News May 5, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి మృతి

image

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి అంబదాస్(30) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

నేడు నీట్ పరీక్ష.. 10 పరీక్షా కేంద్రాలు

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్- 2024 పరీక్ష ఆదివారం జరగనుంది. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరగనున్న పరీక్షకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నీట్ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ భాస్కర్ తెలిపారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News May 5, 2024

మండుతున్న భానుడు.. వర్ని @46.4℃

image

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. శనివారం జిల్లాలోనే అత్యధికంగా వర్ని మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలుగా నమోదైంది. 27 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. గత 3,4 రోజులుగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News May 4, 2024

KMR: నలుగురు విలేకరులపై కేసు.. రిమాండ్‌కు తరలింపు

image

సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన నలుగురు విలేకరులపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు. పెర్కిట్ గ్రామానికి చెందిన నిఖిల్ HYD నుంచి వాహనంలో గూడ్స్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్లుపేట్ వద్ద నలుగురు రిపోర్టర్లు కారులో వచ్చి సేల్స్ టాక్స్ అధికారులమని బెదిరించి రూ.3000 లాక్కున్నటక్లు DSP వెల్లడించారు.

News May 4, 2024

నిజామాబాద్‌: పట్టపగలే ఇంట్లో చోరీ

image

నిజామాబాద్‌లో పట్ట పగలే చోరీ జరిగింది. వినాయక్ నగర్ 100 ఫీట్ల రోడ్‌లోని ఓ ఇంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్​‌లో పనిచేస్తున్న మధు మోహన్ తన భార్యతో కలిసి శనివారం మధ్యాహ్నం కార్ షోరూమ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 10 తులాల బంగారం, 2 కిలోల వెండి చోరీకి గురైంది. 4వ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News May 4, 2024

మాచారెడ్డి: ‘మా గ్రామాన్ని దత్తత తీసుకోండి‘

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో వినూత్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా మాచారెడ్డి మండలం లక్ష్మీరావు పల్లి గ్రామంలో మాట ఇవ్వండి-ఓటు అడగండి ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గ్రామస్థులు కోరినట్లుగా ఉంది.

News May 4, 2024

నిజామాబాద్: గర్భిణి మెడలో బంగారు గొలుసు చోరీ

image

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లి గ్రామానికి చెందిన అంజలి కడుపు నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. ఈనెల 1వ తేదీ రాత్రి అంజలి మెడలో నుంచి 2 1/2 తులాల గొలుసు, రెండు సెల్ పోన్లను అపహరించారు. ఉదయం అంజలి మెడలోని బంగారు గొలుసు సెల్ ఫోన్లు చోరీకి గురైన విషయం భర్త నరేశ్‌కు తెలిపింది. కేసు నమోదైంది.

News May 4, 2024

నిజామాబాద్: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పట్టివేత 

image

తాడ్వాయిలోని శుక్రవారం రాత్రి ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త నుంచి రూ.10,100 నగదు, పార్టీ కండువాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాలిలా.. పార్టీ కార్యకర్త ఓటర్లకు డబ్బు పంచుతున్నట్లు ఎన్నికల సిబ్బందికి సమాచారం అందిందని చెప్పారు. దాడి చేసి ఆ వ్యక్తి వద్ద నుంచి డబ్బు, పార్టీ కండువాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.