Nizamabad

News May 4, 2024

నిజామాబాద్: ఎంపీ అర్వింద్‌పై చార్జిషీట్

image

TPCC ఎన్నారై సెల్, గల్ఫ్ కార్మికుల ఆధ్వర్యంలో MP అర్వింద్‌పై చార్జిషీట్ విడుదల చేశారు. డిచ్‌పల్లి(M)లోని ఓ గార్డెన్స్‌లో కాంగ్రెస్ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో భారతీయులకు ఇస్తున్న వేతనాలను, BJP 30-50 శాతం వరకు తగ్గిస్తూ సర్క్యూలర్లను జారీ చేసి కార్మకులు పొట్ట కొట్టిందన్నారు. మోదీ ప్రభుత్వం ఆన్‌లైన్ ఓటింగ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

News May 4, 2024

ఈనెల 6న కామారెడ్డికి ప్రియాంక గాంధీ

image

ఈనెల 6వ తేదీన కామారెడ్డికి ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ రానున్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ మాట్లాడుతారు. ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనుల్లో కాంగ్రెస్ నేతలు నిమగ్నం అయ్యారు.

News May 4, 2024

ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల తనిఖీల్లో రూ.18.09 లక్షల నగదు, రూ. 49,681 విలువ చేసే 89.635 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్ వన్ టౌన్, టూ టౌన్, ఫోర్త్ టౌన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 4 కేసుల్లో నగదు, నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్లలో 6 కేసుల్లో మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

News May 3, 2024

KMR: నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్‌కు చెందిన వడ్డే సాయిబాబా, గాయత్రీల కుమార్తె సావిత్రి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడిపోయింది. ఎంతసేపటికి కనిపించకపోవడంతో నీటి తొట్టెలో చిన్నారి ఉండటాన్ని గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 3, 2024

NZB: రణక్షేత్రంలా లోక్ సభ ఎన్నికల ప్రచారం

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రణక్షేత్రంలా సాగుతోంది. అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల అగ్రనేతలు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల కరపత్రాలు, గుర్తులతో రూపొందించిన ఫ్లకార్డులను చేతబూని తమ అభ్యర్థికి ఓటేయమని అభ్యర్థిస్తున్నారు. ఇక సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

News May 3, 2024

బీర్కూర్: గుండెపోటుతో ఐకెపి VAO మృతి

image

కామారెడ్డి జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా ఐకెపిలో విధులు నిర్వహిస్తున్న చాకలి బోయిన అంజయ్య (38) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంజయ్యకు కూతురు, కుమారుడు ఉన్నారు. అంజయ్య మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News May 3, 2024

NZB: అది వడ దెబ్బ మృతి కాదు: DMHO

image

జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నీరడి ఎల్లవ్వ మూత్ర పిండ వైఫల్యం కారణంగా మృతి చెందిందని కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మణ్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బతో మృతి చెందినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని నీరడి ఎల్లవ్వ బుధవారం మధ్యాన్నం ఒంటి గంటకు ఆరోగ్యంగానే ఉండి ఇంటి ముందు మేకల పెంపకం పనిలో నిమగ్నమై ఉండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిందన్నారు.

News May 3, 2024

NZB: ఓటు వేసిన 108 సంవత్సరాల అవ్వ

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఫ్రం హోంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డులోని కేసీఆర్ కాలనీకి చెందిన 108 సంవత్సరాల ఈశ్వరమ్మ శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కోసం నియమించిన బృందాలు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆమె ఇంటి వద్దనే ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటు చేసి ఓటు గోప్యతకు భంగం లేకుండా ఓటు వేయించారు.

News May 3, 2024

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్: అరవింద్

image

చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కోసమే రూ. 43 కోట్ల నిధులు విడుదల చేశారని అన్నారు. ఫ్యాక్టరీలు తెరిచేందుకు రూ. 800 కోట్లు అవసరం కాగా ఐదు శాతం నిధులు విడుదల చేశారని విమర్శించారు.

News May 3, 2024

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ (93) శుక్రవారం తన ఓటు హక్కును ఆయన స్వగృహంలో వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనలాంటి వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అందరూ తమ ఓటు హక్కును తప్పనిసరి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.