Nizamabad

News November 7, 2024

బాన్సువాడ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

image

ప్రభుత్వ జూనియర్ కళాశాల బాన్సువాడ(co-ed)లో ఇవాళ సాయంత్రం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు ఇజాజుద్దీన్, దాసరి శ్రీనివాస్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన స్టడీ అవర్స్‌ను పరిశీలించారు. అదే విధంగా పరీక్షల వరకు విద్యార్థులను కష్టపడి చదివించాలని సూచించారు. 

News November 7, 2024

370 కేంద్రాల్లో ధాన్యం సేకరణ: NZB కలెక్టర్

image

ప్రస్తుతం 370 కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 673 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. వాటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 439 కేంద్రాలను, దొడ్డురకం ధాన్యం కొనుగోళ్ల కోసం 234 కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.

News November 7, 2024

నిజామాబాద్ జిల్లాలో నలుగురు సీఐల బదిలీ

image

నిజామాబాద్ జిల్లాలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నార్త్ రూరల్ సీఐ బి.సతీష్ కుమార్, ఆర్మూర్ టౌన్ SHO రవి కుమార్, రుద్రూర్ సీఐ కె.జయేష్ రెడ్డిలను బదిలీ చేస్తూ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇక నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పురుషోత్తంను రామగుండం ట్రాఫిక్-1 SHOగా బదిలీ చేశారు.

News November 7, 2024

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 7, 2024

NZB: చిన్నారిని హత్య చేసిన తల్లితో పాటు మరొకరికి జీవిత ఖైదు

image

మూడేళ్ల కూతురును హత్య చేసిన తల్లితో పాటు మరోవ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని బోధన్ మండలం కల్దుర్కికి చెందిన సంజీవ్, మోర్తాడ్కు చెందిన కూలీ రజిత అలియాస్ రాధతో సహజీవనం చేస్తూ రాధ కూతురు తమకు అడ్డుగా ఉందని భావించారు. దీనితో 2023లో చిన్నారిని కొట్టి నీటిలో ముంచి చంపినట్లు కేసు నిర్దారణ అయ్యింది.

News November 6, 2024

గవర్నర్‌ను కలిసిన షబ్బీర్ అలీ

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News November 6, 2024

బిక్కనూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో జరిగింది. పెద్దమల్లారెడ్డికి చెందిన కొట్టాల సిద్ధరాములు (66) ఈ నెల 4న చేపల వేటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో జాలరులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా బుధవారం చెరువులో మృత దేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News November 6, 2024

నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు

image

ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.

News November 6, 2024

నిజామాబాద్: నేటి నుంచి సర్వే స్టార్ట్

image

సమగ్ర కుటుంబ సర్వే నేటి నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే చేయాల్సిన ఇళ్లను లిస్టింగ్ చేశారు. 1273 మంది ఆశాలు, 2182 మంది అంగన్వాడీలు, 537 మంది పీఎస్‌లు, 1837 మంది టీచర్లు ఇందులో పాల్గొనున్నారు. జిల్లాలో మొత్తం 3,245 బ్లాక్‌లు ఉండగా, 3,343 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. 370 మంది సూపర్వైజర్లు ఇందులో పాల్గొంటారు.

News November 6, 2024

లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

image

లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.