Nizamabad

News May 3, 2024

సిరికొండ: మంటలంటుకుని రైతు మృతి

image

ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ రైతు మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని పెదవాల్గోట్ గ్రామానికి చెందిన లాయిడి కిషన్(58) పోత్నూర్ గ్రామ శివారులోని తన పంట పొలం వరి కంకులకు నిప్పు పట్టాడు. ఈ క్రమంలో మంటలంటుకుని కిషన్ మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

NZB: అత్తమామ వేధిస్తున్నారని.. వివాహిత ఆత్మహత్య

image

అత్తమామల వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలంలోని ఆరేడులో జరిగింది. బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్‌కు చెందిన స్వప్న (22)కు నిజాంసాగర్ మండలంలోని ఆరేడుకు చెందిన గడ్డం రాజుతో పెళ్లయింది. ఉపాధి నిమిత్తం రాజు హైదరాబాద్‌కు వచ్చాడు. అత్తమామలు రత్నవ్వ, క్రీసూస్తం తరచూ వేధిస్తున్నారు. దీంతో స్వప్న ఉరేసుకుని చనిపోయింది.

News May 3, 2024

KMR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బిక్కనూర్ మండలంలోని పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్ట్ 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడు.
కామారెడ్డికి చెందిన అర్కల వెంకట్ (39) అనే వ్యక్తి చెక్‌పోస్ట్ వద్ద రోడ్డుపై ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆయన స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ మేరకు ఎస్సై సాయికుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

News May 3, 2024

NZB: రెండు నియోజకవర్గాలు.. 3768 పోలింగ్ బూత్‌లు

image

నిజామాబాద్ MP స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ MPస్థానంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ రూరల్ 293, నిజామాబాద్ అర్బన్ 289, జగిత్యాల 254, కోరుట్ల 252, బాల్కొండ 246, బోధన్ 246, ఆర్మూర్ 217 బూత్‌లు ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జహీరాబాద్ 313, అందోల్ 313, నారాయణఖేడ్ 296, ఎల్లారెడ్డి 270, కామారెడ్డి 266, బాన్సువాడ 258, జుక్కల్ 255 బూత్‌లు ఉన్నాయి.

News May 3, 2024

ఇందూరుకు విమాన మోక్షమెప్పుడో!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం చాలా విదేశాలకు వెళ్తుంటారు. ఒక్క బాల్కొండ నుంచే సుమారు 2,200 మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరందరికి రాకపోకలకు విమానాశ్రయం అనేది సాధారణ అవసరంగా మారింది. జక్రాన్‌పల్లిలో ఏర్పాటు చేస్తామన్న విమానాశ్రయం హమీ ఆచరణకు నోచుకోలేదు. జక్రాన్‌పల్లిలో 1200 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కానీ నిర్మాణ పనులకు మాత్రం నోచుకోలేదు.

News May 3, 2024

నిజామాబాద్: ‘బీడీ కార్మికుల బతుకు పోరాటంపై కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ’

image

బీడీ కార్మికుల బతుకు పోరాటంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. గురువారం నిజామాబాద్‌లో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు లక్షల బీడీ కార్మికులు 14 బీడీ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తేసి వారికి ఉపాధి భరోసా కల్పిస్తామని చెప్పారు.

News May 2, 2024

నిజామాబాద్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును మే 4వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తెలిపారు. వార్షిక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మరో రెండు రోజులు ఫీజు గడువును పొడిగించామని తెలిపారు.

News May 2, 2024

నిజామాబాద్: నగదు కట్టలు పట్టివేత 

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిజమాబాద్ గంజి మార్కెట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో రూ.4 లక్షలు పట్టుబడ్డాయని వన్ టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. నేతి శ్రావణ్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నామని, వీటికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు చూపించనందున డబ్బును స్వాధీనపరచుకున్నట్లు SHO వివరించారు.

News May 2, 2024

కామారెడ్డి జిల్లాలో 4,546 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

image

ఎన్నికల విధులు, ఇతర అత్యవసర విధులు నిర్వహిస్తున్న 4,546 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని KMR జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 1,081, ఎల్లారెడ్డిలో 1,298, కామారెడ్డి నియోజకవర్గంలో 2,167 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.

News May 2, 2024

కామారెడ్డి జిల్లాలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారులో ఈరోజు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నర్సయ్య మృతిచెందగా అతడి భార్య లలిత, దిలీప్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.