Nizamabad

News November 4, 2024

ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలి: మందకృష్ణ

image

మాదిగలు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కామారెడ్డిలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొన్నారు. వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

News November 3, 2024

ఒట్లు తీసి గట్టు మీద పెట్టిన సీఎం: ఎంపీ అర్వింద్

image

ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లు గట్టు మీద పెట్టేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడన్నారు. రైతులకు రుణమాఫీ, బోనస్, కళ్యాణ లక్ష్మితోపాటు బంగారాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

News November 3, 2024

NZB: చెరువులో మునిగి ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. . హైదరాబాద్‌కు చెందిన కొందరు ఆదివారం మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో ఇద్దరు యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగగా.. నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి యువకుల మృతదేహలు లభ్యమయ్యాయి.

News November 3, 2024

SRSP UPDATE: నిలకడగా నీటి మట్టం

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నిలకడగా ఉంది. ఆదివారం ఉదయం ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 4,787 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కెనాల్ కు 2883, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News November 3, 2024

ఆర్మూర్: పూల కుండీ పేలి బాలుడి చేతికి తీవ్ర గాయాలు

image

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో దీపావళి పండుగ మరుసటి రోజు పూలకుండీ పేలడంతో ఓ బాలుడు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. టపాసులు నాసిరకంగా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

News November 2, 2024

నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ

image

నిజామాబాద్ సుభాష్ నగర్ న్యూ ఎన్జీవో కాలనీలో తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. కాలనీకి చెందిన సముద్రాల ఏలేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా గుర్తు తెలియని దొంగలు తాళం పగుల గొట్టి చోరికి పాల్పడ్డారు. బీరువాలోని 22 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు దోచుకుపోయారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ SHO మహేశ్ తెలిపారు.

News November 2, 2024

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..

image

కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

News November 2, 2024

NZB: గంజాయి స్మగ్లర్లకు సహకారం.. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్‌చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.

News November 2, 2024

నేడు బిక్కనూరులో పర్యటించనున్న షబ్బీర్ అలీ

image

శనివారం బిక్కనూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఆయన ప్రారంభిస్తారని, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యకర్తలు హాజరై ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News November 1, 2024

పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి SP

image

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని, జిల్లాలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయని KMR ఎస్పీ సింధూ శర్మ అన్నారు. ఇప్పటివరకు పేకాటలో 309 మందిపై కేసు నమోదు చేసి రూ.7,79,440 నగదుతో పాటు 146 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఎవరైనా పేకాడుతున్నట్లు తెలిస్తే వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్లు 8712686109, 8712686133కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.