Nizamabad

News August 3, 2024

NZB: స్థానిక సంస్థల ఎన్నికలు.. వేడెక్కిన రాజకీయాలు

image

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలు గ్రామాల్లో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓడిన, పోటీ చేయలేక వెనక్కి తగ్గిన వారు ఈసారి తగ్గేదేలే అంటున్నారు. కాగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.

News August 3, 2024

NZB: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈ నెల 5 నుంచి 9 వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠినచర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, జీపీ ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు .

News August 2, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* బోధన్ – బీదర్ రైల్వే లైన్ ను నిర్మించండి: MP సురేష్ షెట్కార్
* CM రేవంత్ టీచర్లతో ముఖాముఖి.. సభకు తరలి వెళ్లిన జిల్లాలోని ఉపాధ్యాయులు
* ఇందల్వాయి: శీలం జానకీ బాయి జలసోయగం (డ్రోన్ షాట్)
* క్రీడాకారిణి ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలి: జుక్కల్ MLA తోట
* మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజీవ్
* KMR జిల్లాల్లోని పలు PSలో బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐలు
* SRSPకు కొనసాగుతున్న వరద

News August 2, 2024

KMR: జాబ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు

image

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కామారెడ్డికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 15 మంది నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశాడని ఆయన తెలిపారు. కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించకపోగా.. ఫేక్ జాబ్ లెటర్లు అందజేసి పత్తాలేకుండా పోయాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో ప్రవీణ్‌ను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.

News August 2, 2024

NZB: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషిచేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు.

News August 2, 2024

NZB: చిన్నారిపై లైంగిక దాడి.. పోక్సో కేసు

image

నిజామాబాద్ నగరంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు టూ టౌన్ ఎస్సై రాము తెలిపారు. పూసలగల్లీ ప్రాంతంతో ఓ బాలిక(5) ఇంటి ఎదుట ఆడుకుంటుండగా గణేశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని SI తెలిపారు.

News August 2, 2024

కామారెడ్డి: మహిళను హత్య చేసిన ఘటనలో వ్యక్తి అరెస్ట్

image

ఇటీవల ఓ వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసినట్లు నిందితుడు మాధవ్ అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉమా భర్త అశోక్‌తో మూడేళ్ల క్రితమే విడిపోయింది. దీంతో పంచముఖి కాలనీలో అద్దె ఇంట్లో ఉమా, మాధవ్ సహజీవనం చేస్తున్నారు. తనతో గొడవ పడిందని, ఆమె మెడకు చున్నీ బిగించి, గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నారని చెప్పారు.

News August 2, 2024

కామారెడ్డి: మద్యం తాగి చెరువులో దూకేశాడు

image

యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి(D) బీర్కూర్‌‌‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్‌కుమార్(25) ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్నాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని తల్లిని అడగగా ఇవ్వలేదు. దీంతో అమ్మమ్మను, తల్లిని కొట్టి మద్య తాగి, బాజన్ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సమాచారం అందుకున్న పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 2, 2024

BREAKING.. కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 44 నంబర్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సదాశివనగర్ పోలీసులకు సమాచారం అందించారు.

News August 2, 2024

నిజామాబాద్: వాగులో కొట్టుకొచ్చిన మృతదేహం

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామ శివారులోని వాగులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు (50) ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.

error: Content is protected !!