Nizamabad

News November 1, 2024

NZB జిల్లాలో దీపావళి రోజు 116 కేసులు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం భారీగా పేకాట కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ శుక్రవారం వివరాలను వెల్లడించారు. దీపావళి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 116 పేకాట కేసుల్లో 597 మంది పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద రూ.11,47,240 స్వాధీనం చేసుకున్నామన్నారు.

News November 1, 2024

కామారెడ్డి: డబ్బుల కోసం తండ్రి హత్య

image

కామారెడ్డి జిల్లాలో నస్రుల్లాబాద్‌లో <<14501984>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. నెమలి గ్రామానికి చెందిన హన్మాండ్లు మద్యానికి బానిస అయ్యాడు. గురువారం అర్ధరాత్రి డబ్బుల విషయంలో తండ్రి సాయిబోయి(55)తో గొడప పడ్డాడు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న హన్మాండ్లు కర్రతో కొట్టడంతో చనిపోయాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News November 1, 2024

BREAKING: కామారెడ్డి జిల్లాలో మరో హత్య

image

కామారెడ్డి జిల్లాలో మరో హత్య జరిగింది. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో నిజామాబాద్ జిల్లా ధర్మారం(బి) గ్రామానికి చెందిన పిట్ల కృష్ణని తలపై కొట్టి గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News November 1, 2024

BREAKING: కామారెడ్డి జిల్లాలో హత్య

image

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నస్రుల్లాబాద్ మండలంలో కొడుకు హన్మాండ్లు తండ్రి సాయిబోయి(55) ని కర్రతో కొట్టి హత్య చేశాడు. మద్యం మత్తులో చంపినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2024

ఎల్లారెడ్డి: పేకాట రాయుళ్ల అరెస్ట్

image

ఎల్లారెడ్డి మండలం రత్నపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు కచ్చితమైన సమాచారం రావడంతో గురువారం రాత్రి దాడి చేసి పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఏడుగురు వద్ద నుంచి రూ.5,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు  చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేశ్ వివరించారు.

News October 31, 2024

కామారెడ్డి: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ

image

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయములో జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ సింధూ శర్మ సర్ధార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో దేశంలో ఐక్యమత్యాన్ని, దేశ సమగ్రత కాపాడతామని అడిషనల్ ఎస్పీ కె.నరసింహారెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. 

News October 31, 2024

బోధన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సూపర్ లగ్జరీ బస్సు

image

బోధన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నవంబర్ 4వ తేదీ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డీఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు బస్సు బోధన్ నుంచి బయల్దేరుతుందని, వర్ని, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జేబీఎస్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందన్నారు. బోధన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఒక్కొక్కరికి రూ.590 చార్జీ ఉంటుందని తెలిపారు.

News October 31, 2024

సదాశివ నగర్: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పండగ నాడు ఘోరం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశారని ఎస్ఐ చెప్పారు.  ఈ వ్యక్తికి ఎడమ చేయి లేదని పేర్కొన్నారు. వివరాలకు సదాశివ నగర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2024

నిజామాబాద్: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు

image

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు విధించారు. బోయిన్‌పల్లి CI, SI వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సాయిలు సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హల్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ హౌస్‌కింపింగ్ చేసే వ్యక్తి కూతురిపై 2019లో సాయిలు పలుసార్లు అత్యాచారం చేశాడు. 2020లో బాలిక గర్భందాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.

News October 31, 2024

జల్లాపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

image

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట కేంద్రంలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.