Nizamabad

News April 28, 2024

NZB: GREAT: 78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు

image

చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్‌కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయస్సులో ఆయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 25 నుంచి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా బోర్గాం(పీ) కేంద్రంలో ఈయన పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్ BSNLలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్ అయ్యారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసైనట్లు పేర్కొన్నారు.

News April 28, 2024

కామారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ బస్సు <<13133998>>ఢీకొని<<>> వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్ వద్ద నిజామాబాద్ నుంచి కామారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సును రమణయ్య అనే వ్యక్తి స్కూటీతో ఢీ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

News April 27, 2024

మాచారెడ్డిలో రూ.4,98,300 లక్షల నగదు సీజ్

image

మాచారెడ్డి మండలంలో శనివారం అంతర్ జిల్లా ఘన్పూర్ చౌరస్తా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.4,98,300 లక్షల నగదును పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆ నగదును సీజ్ చేసి సదరు వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్ఎస్‌టీ మహేందర్, సిబ్బంది ఉన్నారు.

News April 27, 2024

నిజామాబాద్ జిల్లాలో పట్టుబడిన నగదు వివరాలు

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో రూ.1.22 కోట్ల నగదు, రూ.1.28 కోట్ల విలువ చేసే బంగారం, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అలాగే పోలీసులు, ఎక్సైజ్ శాఖల ద్వారా 52 వేల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నాయన్నారు.

News April 27, 2024

NZB: ఎన్నికల తనిఖీల్లో నగదు, మద్యం స్వాధీనం: CP

image

ఎన్నికల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ 1.56 లక్షల నగదు, రూ. 89,490 విలువ చేసే 177.76లీటర్ల మద్యం, నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జక్రాన్పల్లి, నిజామాబాద్, ఆర్మూర్, కమ్మర్ పల్లి, భీంగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 కేసుల్లో ఈ నగదు, మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

News April 27, 2024

డిచ్పల్లిలో చిన్నారిపై వీధి కుక్క దాడి

image

డిచ్పల్లి మండలం ఘన్పూర్‌లో శనివారం ఉదయం ఓ చిన్నారి రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కిందపడిన చిన్నారి అరవడంతో గమనించిన తల్లి కుక్కను తరిమేసింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, పంచాయతీ సిబ్బంది స్పందించి వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

News April 27, 2024

నిజామాబాద్ జిల్లాలో అతివలే నిర్ణేతలు..!

image

NZB లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌(U), నిజామాబాద్‌(R), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో 3,294 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 8,06,130, మహిళలు 8,98,647, ట్రాన్స్‌జెండర్స్‌ 90 మంది ఉన్నారు. మెుత్తంగా మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితం అతివల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

News April 27, 2024

బాన్సువాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బాన్సువాడ పట్టణంలోని బస్సు డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నాచుపల్లికి చెందిన సాయికుమార్, చించోల్లికి చెందిన మారుతి శుక్రవారం రాత్రి బైక్ పై వెళ్తుండగా బస్ డిపో వద్ద కారు వీరి వాహనాన్ని ఢీకొంది. వారిద్దరూ కింద పడిపోగా వెనక నుండి వచ్చిన లారీ వారి కాళ్లపై నుండి వెళ్ళింది. తీవ్రంగా గాయపడ్డ మారుతి మృతి చెందగా, సాయి కుమార్ చికిత్స పొందుతున్నాడు.

News April 27, 2024

NZB: అప్పుడు కలెక్టర్లు.. ఇప్పుడు MLA అభ్యర్థులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా పని చేసి పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. 2007 నుంచి 2009 వరకు కలెక్ట‌ర గా పనిచేసిన బి. రామాంజనేయులు..ఇప్పుడు ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2010 నుంచి 2012 వరకు కలెక్టర్‌గా పనిచేసిన డి.వరప్రసాద్..రాజోలు నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. మరీ వారికి విజయం వరిస్తుందో లేదో చూడాలి

News April 27, 2024

నిజామాబాద్‌: బండరాయితో భర్తను హత్య చేసిన భార్య

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. ఈ ఘటన మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలోని వడ్డెర కాలనీలో జరిగింది. బోధస్ లక్ష్మణ్(35) అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య లక్ష్మీ బండరాయితో తలపై మోది హత్య చేసింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన లక్ష్మీ బండరాయితో కొట్టి హత్య చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు.