India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భర్తను.. భార్య హత్యచేసింది. మోపాల్ మండలం కులాస్పూర్కు చెందిన సాయిరెడ్డి(55) నిద్రలో ఉండగా అతని భార్య రాధా దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే భర్త వేధింపులు భరించలేక ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఎల్లెందుల ఆర్యన్ జేఈఈ మెయిన్స్ లో 99.275 పర్సంటైల్ సాధించాడని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఆర్యన్ హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్యన్ జేఈఈ మెయిన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్యన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తాను ఐఐటీలో చేరుతానని ఆర్యన్ తెలిపారు.
పోలింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో రోడ్షోలు, బహిరంగసభలు, కార్నర్ సమావేశాలు నిర్వహించేందుకు BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 30న అందోల్లో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ వచ్చే నెల 7న కామారెడ్డిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు.
మద్యానికి బానిసై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గాడిదల గంగాధర్ (25) కూలీ పని చేసేవాడు. పని చేయగా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ మద్యం సేవించేవాడు. దీంతో మద్యానికి బానిసైన గంగాధర్ జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు
ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నిజామాబాద్ లోక్సభకు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్, జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్తో పాటు ఇతర పార్టీల వారు నామినేషన్ వేశారు. జహీరాబాద్ లోక్సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.
రెండు దశల్లో ఆన్ లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నిజామాబాద్కు చెందిన ఎం. శ్రీవల్లి 99.42, కె. శ్రేయస్ కుమార్ 98.75 పర్సంటైల్ సాధించగా వారికి అభినందనలు వెల్లువెత్తాయి. మేథన 98.49, అబ్దల్ మాలిక్ 98.30 పర్సంటైల్ సాధించారు. నందిని అనే విద్యార్థిని ఆల్ ఇండియా 12 వ ర్యాంక్, రాఠోడ్ ప్రవీణ్ 1514వ ర్యాంక్ సాధించారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షకు 1017 మందికిగాను 910 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 1490 మందికిగాను 1340 మంది హాజరుకాగా, 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ అరబిక్ పరీక్షకు గాను 23 మంది పరీక్షకు హాజరయ్యారు. పలు పరీక్షాకేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు
NZB జిల్లా కొత్తపేట్ శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బడాపహాడ్ను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఉన్న DCM బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరు కమ్మర్ పల్లికి చెందినట్లు సమాచారం. గాయపడ్డవారిని వైద్యం కోసం NZB ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ వాహనంలో 36 మంది ఉన్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని KMR DSP నాగేశ్వర రావు తెలిపారు. బస్వాపూర్లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. గ్రామ రక్షక దళాలు అద్భుతంగా పనిచేయడం వల్ల నేరాలు నియంత్రణలో ఉన్నాయన్నారు. అందుకు సహకరిస్తున్న యువతను ఆయన అభినందించారు. బిక్కనూరు CI సంపత్ కుమార్, SI సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళపై గొడ్డలితో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన ధర్పల్లి మండలం గోవిందపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డెనుక గోపి అదే గ్రామానికి చెందిన సుగుణపై గురువారం గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గత కొద్ది రోజులుగా భూతగాదాలు ఉన్నాయని, గతంలో కూడా గొడవ పడినట్లు పేర్కొన్నారు. బాధితురాలి కూతురు లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.