Nizamabad

News April 25, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే

image

నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జీవన్ రెడ్డి అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను తెలిపారు. కుటుంబ ఆస్తుల వివుల రూ.3.55 కోట్లు ఉన్నాయి. ఓ ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆయనకు 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఆయన భార్యకు 50 తులాల బంగారు ఆభరణాలున్నాయి. కాగా, ఆయనకు రూ.68.38లక్షల చరాస్తులు, 35.24 ఎకరాల భూమి, జగిత్యాలలో ఇల్లు ఉంది. బ్యాంకులో రూ.58.14 లక్షల రుణాలు, 4 క్రిమినల్ కేసులున్నాయి.

News April 25, 2024

బీబీపాటిల్‌కు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం..!

image

నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో అగ్రనేతల ప్రచారానికి బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతుగా ఆందోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని సుల్తాన్ పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

News April 25, 2024

మాచారెడ్డి: మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య

image

ఉరేసుకొని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… అంజయ్య (58) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తన కొడుకు ఇటీవల హనుమాన్ మాల ధరించాడు. అతను కూడా మాల ధరిస్తానని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు నిరాకరించడంతో మనస్తాపం చెంది తన వ్యవసాయం క్షేత్రంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News April 25, 2024

డిచ్పల్లి: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కేజీబీవీ విద్యార్థిని

image

డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి శివారులోని కేజీబీవీలో చదివిన మండలంలోని లచ్చమొల్ల నందిని ఎంపీసీలో 470కి గాను 464 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ సవిత బుధవారం తెలిపారు. నందిని తల్లిదండ్రులు నవత, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దత్తాద్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా నిరూపించుకున్నారన్నారు.

News April 25, 2024

ఎల్లారెడ్డి: ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన ఆదర్శ, గురుకుల విద్యార్థులు

image

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో, ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్స్ పి. సాయిబాబా తెలిపారు. ఆదర్శ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థినీలు ఎస్. హర్షిత 945 (ఎంపీసీ), హాబీ మదిహ 922 (బైపీసీ), అశ్మిత 816 (సీఈసీ)లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

News April 25, 2024

పెద్దకొడప్గల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అన్నా చెల్లెలు

image

పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన అన్న చెల్లెలు జ్ఞానేశ్వర్, హారిక నేడు వెలువడిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. జ్ఞానేశ్వర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 952/1000, హారిక ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 465/470 మార్కులు సాధించారు. అన్నా చెల్లెలు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.

News April 25, 2024

NZB: ఎన్నికల కోడ్.. భారీగా నగదు పట్టివేత!

image

ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 53,42,830 నగదును పోలీసులు పట్టుకున్నారు.

News April 25, 2024

NZB: మహిళ మెడలోంచి చైన్ లాక్కెల్లిన దొంగలు

image

ఓ మహిళ మెడలోంచి చైన్ దొంగలించిన ఘటన నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగమణి బుధవారం సాయంత్రం స్థానిక హనుమాన్ మందిరం వద్దకు వెళ్లింది. అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

నేడు నిజామాబాద్‌కు ఉత్తరాఖండ్ సీఎం రాక

image

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గురువారం జిల్లాకు రాన్నున్నారు. ఆయనతో కలిసి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 25, 2024

పిట్లంలో బైక్‌ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి

image

పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో జాతీయ రహదారి (161)పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై రాంగ్ రూట్‌లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీకొంది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.