India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాకేంద్రం సుభాష్నగర్లోని SFS పాఠశాలకు చెందిన స్నేహిత రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీడీ ప్రకాష్ తెలిపారు. రాష్ర్టస్థాయి పోటీలకు పాఠశాల క్రీడాకారిణి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోజీ, ఉపాధ్యాయ బృందం, పలువురు అభినందనలు తెలిపారు. స్నేహిత మహబూబ్నగర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించనుంది.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలకేంద్రానికి చెందిన తక్కడ్పల్లి ప్రతిభ వరల్డ్ ఛాంపియన్ షిప్ చెస్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఆర్మేనియా దేశం, ఏరేవాన్లో జరగనున్న 6వ ప్రపంచ స్థాయి చేస్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లా నుంచి ప్రపంచ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
☛ ALL THE BEST PRATIBA
ఎగువ నుంచి వరద నీటి ఇన్ ఫ్లో తగ్గడంతో అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4 వరద గేట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. నిన్న 17 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు, ఈ రోజు ఉదయం 8 గేట్ల ద్వారా నీటిని వదిలారు. ఉద్ధృతి తగ్గడంతో 4 గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 26,950 క్యూసెక్కుల నీరు వస్తుండగా 4 గేట్ల ద్వారా 12,496 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.ED మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫీజు టైం టేబుల్ విడుదలైంది. పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీలోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి అరుణ తెలిపారు. అపరాధ రుసుముతో వచ్చే నెల 1వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు. కావున విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
నిజామాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఇటీవల కాలం వరకు పని చేసిన విష్ణుమూర్తిని సస్పెన్షన్ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేసిన సమయంలో విష్ణుమూర్తి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, సివిల్ సెటిల్మెంట్లు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తగా అప్పటి సీపీ కల్మేశ్వర్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు 2 రోజుల క్రితం సస్పెండ్ చేశారు
డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు నేడు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలన్నింటినీ సీఎం పరిష్కరిస్తారని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని వైస్ ఛాన్సలర్కు సీఎం సూచించారు.
తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పదవిని తిరస్కరించారు. ఆయనను ఏడుగురు సభ్యుల్లో ఒక సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ అయినా తనను సభ్యుడిగా నియమించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో చర్చిస్తోంది.
KTR ట్వీట్ పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం ఏ అంశాల్లో తగ్గిపోయిందో KTR చెప్పాలని డిమాండ్ చేశారు. గత BRS ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ అప్పుకు రాష్ట్ర రాబడిలో కేవలం 60 శాతం మాత్రమే వడ్డీ కట్టడానికి సరిపోతుందన్నారు.
హత్యా రాజకీయాలను ప్రభుత్వం ఉపేక్షించదని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్ లో మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదన్నారు. దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ విషయంలో పోలీసులతో మాట్లాడతానని పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను గమనించి శుభ్రంగా ఉంచాలని హెచ్చరించి, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించామన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న శాతవాహన హోటల్ కు రూ.2000 జరిమానా విధించినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.