Nizamabad

News July 27, 2024

నిజామాబాద్ జిల్లాలో 9 మంది తహశీల్దార్‌ల బదిలీ

image

సాధారణ బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం ఈ నెల 31 వరకు బదిలీలను చేపడుతుంది. అందులో భాగంగా మల్టీజోన్-1 పరిధిలోని ఇతర జిల్లాల నుంచి తహశీల్దార్‌లను నిజామాబాద్‌కు కేటాయించగా జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ అయ్యారు.

News July 27, 2024

NZB: కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష

image

కులం పేరుతో దూషించి, పొలంలోని పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4,700 జరిమానా విధించారు. ఏర్గట్లలోని తొర్తి గ్రామానికి చెందిన చిన్న లింబన్న అదే గ్రామానికి చెందిన చిన్న సాయన్న పొలంలోని పైపులను కాల్చేశాడు. ఎందుకు కాల్చావని సాయన్న అడిగితే అతడిని కులం పేరుతో దూషించాడు. దీంతో సాయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 27, 2024

పిట్లం: దిగొచ్చిన టమాట ధర @ రూ.25

image

మొన్నటి వరకు కిలో రూ.100 ఉండి సామాన్యుడికి భారంగా మారిన టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. పిట్లంలో శుక్రవారం జరిగిన వారాంతపు సంతలో టమాటా ధర కిలో రూ.25 పలికింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. టమాటతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి.

News July 27, 2024

NZB: పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్

image

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వబడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు.

News July 26, 2024

నిజామాబాద్: TODAY NEWS HEADLINES

image

* బాన్సువాడ, ఎల్లారెడ్డిలో CM రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
* SRSP పునాదికి 60 ఏళ్లు అధికారుల సంబరాలు
* ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం ఒకరు దుర్మరణం
* పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి: కలెక్టర్ రాజీవ్ గాంధీ
* బడ్జెట్లో KMR జిల్లాకు అన్యాయం: BJP జిల్లా అధ్యక్షురాలు అరుణ తార
* నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రూ. 50 లక్షలు పట్టివేత
* SRSP కు వరద తాకిడి. నిజాంసాగర్‌కు స్వల్ప ఇన్ ఫ్లో

News July 26, 2024

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

image

మెండోరా మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందిన సమాచారం మేరకు ప్రాజెక్టులోకి 25,150 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. క్రమక్రమంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1072.8 అడుగులకు నీటిమట్టం చేరుకోగా.. ప్రాజెక్టులో 28.389 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది.

News July 26, 2024

NZB: హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News July 26, 2024

NZB: ఫోన్‌ల రికవరీలో నంబర్ వన్ ఠాణా ఇదే.!

image

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 1వ ఠాణా ఫోన్‌ల రికవరీలో నంబర్ 1గా నిలిచింది. ఫోన్లు చోరీకి గురైన, పోగొట్టున్న వారి నుంచి 1,432 ఫిర్యాదులు రాగా వాటిలో 904 సెల్ ఫోన్లను గుర్తించారు. అందులో 504 మంది బాధితులకు ఫోన్లు అందించడంతో 1వ ఠాణా ప్రథమ స్థానంలో నిలిచింది. KMR జిల్లాలోని బాన్సువాడ పోలీస్ స్టేషన్ 303 ఫోన్లు రికవరీ చేసి 13వ స్థానం, కామారెడ్డి పట్టణ ఠాణా 206 ఫోన్లు రికవరీ చేసి 21 స్థానంలో నిలిచాయి.

News July 26, 2024

NZB: కుక్కర్ కోసం మహిళపై కత్తితో దాడి

image

మహిళలపై కత్తితో దాడి చేసిన ఘటన నవీపేట్‌లో జరిగింది. జలాల్‌పూర్‌కి చెందిన గంగవ్వ అదే గ్రామానికి చెందిన సావిత్రి వద్ద నెల కిందట కుక్కర్ కొనుగోలు చేసింది. అది సరిగ్గా పనిచేయకపోవడంతో పలుమార్లు వారికి గొడవ జరిగింది. కాగా గురువారం సావిత్రి.. గంగవ్వను డబ్బులు ఇవ్వాలని అడగ్గా దానికి గంగవ్వ నిరాకరించింది. దీంతో కోపగించుకున్న సావిత్రి ఆమె తలపై కత్తితో నరికింది. ఈ ఘటనపై SI యాదగిరి గౌడ్ కేసు నమోదు చేశారు.

News July 26, 2024

కామారెడ్డి: ఉరేసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య.. వివరాలు ఇవే.!

image

తల్లి, కూతురు <<13707442>>ఆత్మహత్య<<>>కు పాల్పడ్డ విషయం తెలిసిందే. మాలన్ బాయి, కుమార్తె మనీషా, కుమారుడు మంగళ్ దీప్తోతో కలిసి డోంగ్లిలో నివాసముంటుంది. కొద్ది రోజులుగా మాలన్ బాయి అనారోగ్యంగా ఉండటంతో పాటు కుమార్తె మనీషా మానసిక స్థితి బాగలేకపోవడంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని జుక్కల్ SI సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఆమె భర్తను హత్య చేసిన కేసులో మాలన్ A1గా ఉంది.

error: Content is protected !!