India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సోమవారం 12 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు మళ్లీ ఒకటి, రెండు సెట్ల చొప్పున నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు.
ఈ నెల 23న నిర్వహించే హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు 1200 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడువున CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ నుంచి వాహనాల దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
ప్రముఖ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో నిజామాబాద్ బీఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ముడుపు కట్టారు. తొలుత ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ముడుపుకట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్స్ మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హనుమాన్ జయంతి ఉన్నందున మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్స్ సోమవారం సాయంత్రం 6 గం.ల నుంచి బుధవారం (24) ఉ. 6 గం.ల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
జహీరాబాద్ BJP ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గల్లీ గల్లీకి వెళుతూ..BJP కే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్ లో ఇంటింటికీ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. తన తండ్రి బిబి పాటిల్ ను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నోటిఫికేషన్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాగా మిగిలిన 10 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తో పాటు మిగిలిన జాతీయ పార్టీల నుంచి ఇంకా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
NZB కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు. జహీరాబాద్ BJP ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ నేడు సంగారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ హాజరుకానున్నారు. అంతకుముందు సంగారెడ్డిలోని గడ్డ గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని సిద్ది రామేశ్వర్ నగర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు లప్పం లోడుతో వెళుతున్న లారీ.. ప్రమాదవశాత్తు డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ జాతీయ రహదారిపై బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
బాన్సువాడ పట్టణానికి ఈనెల 25న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నట్లు అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. వీక్లీ మార్కెట్లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిబి పాటిల్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నుంచి ఉన్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.