India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వారం రోజులుగా అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో చోట కురుస్తూనే ఉంది. ధర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్, ఇందల్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22న నిజామాబాద్ జిల్లాకి రానున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లాకు వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మండలంలోని జంగంపల్లి బస్ షెల్టర్లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన పంచాయతీ సెక్రటరీ గుడిసె బాబు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
సైబర్ మోసగాళ్ల వేధింపులను తట్టుకోలేక ఆర్మూర్ మండలానికి చెందిన నాగరాజ్(18) అనే డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగరాజ్ ఓ ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ మోసగాళ్లు అతడికి ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని నిషేధిత యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటావని బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వాలని లేకపోతే అరెస్టు చేస్తామన్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు రూ.4.61 కోట్ల ఆస్తులున్నాయి. కుటుంబం పేరిట 100 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం 42.11 ఎకరాల వ్యవసాయ భూములు, 1000 గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.41 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.3.20 కోట్లు. కుటుంబానికి అప్పులేమీ లేవు.
NZB బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్వింద్ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. ఎలాంటి భూముల్లేవు. జూబ్లీహిల్స్లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లుగా ఉన్నాయి.
నిజామాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. నడుస్తున్న రైలును ఎక్కబోయి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందింది. రైల్వే ఎస్సై సాయా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన పసుల రేవతి శుక్రవారం నిజామాబాద్ నగరానికి వచ్చింది. తిరిగి శనివారం ఉదయం 6 గంటల డెమో రైలులో కామారెడ్డికి వెళ్లేందుకు టికెట్ తీసుకుంది. రైలు మెళ్లగా నడుస్తున్న క్రమంలో రైలు ఎక్కబోగా కిందపడి మృతి చెందింది.
బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వ్యభిచార గృహంపై దాడి జరిపారు. నగర శివారులోని పాంగ్రాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు జరిపారు. ఓ విటుడితో పాటు విటురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలు పర్వీన్ బేగంపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్లో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన పోలేపల్లి ఇంద్రజ (40) ఉపాధిహామీ పనికి వెళ్లి అక్కడే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త పోలేపల్లి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లల వివాహం ఎలా చేస్తామో అని బాధపడేదని ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు.
Sorry, no posts matched your criteria.