India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు గురువారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ప్రదీప్ పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి సునీత తీర్పు వెల్లడించారు. వివరాలిలా.. ఆలూరు(M)కు చెందిన గంగుకు తన కోడలితో గొడవలు జరిగేవి. ఈ విషయాన్ని వెంకటి అనే వ్యక్తికి చెప్పడంతో అతడు నగలు దోచుకోవాలనే దురుద్దేశ పడ్డాడు. గొడవ పడకుండా ఉండేందుకు పూజలు చేయాలని చెప్పాడు. 2022 SEP 27న ఓ మడుగులో స్నానం చేయాలని చెప్పాడు. ఆమె నీటిలో దిగగానే మెడకు చీర చుట్టి చంపేశాడు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉమెన్ క్రికెట్ లీగ్కు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన హంసిని, అమూల్య ఎంపికైనట్లు కోచ్ బాగారెడ్డి తెలిపారు. ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి మహిళా క్రికెటర్ల ఎంపికలు నిర్వహించారు.
రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బోధన్ మండలానికి చెందిన యువ రైతు రవి మాట్లాడారు. రూ. 2 లక్షల రుణమాఫీ అమలులోకి తెచ్చి రైతాంగానికి ఎనలేని భరోసా అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుణమాఫీతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు.
అంకాపూర్ చికెన్ తినిపిస్తావా? లేదా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన యువ రైతు రవిని అడిగారు. రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవితో మాట్లాడుతూ.. చికెన్ గురించి అడిగారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 2022 ఆగస్టులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లింపులో కాలయాపన జరుగుతోందని వరంగల్కు చెందిన పౌర హక్కుల సంఘం ప్రతినిధి బక్క జడ్సన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ కమిషన్ జిల్లా కలెక్టర్కు సమన్లు జారీ చేసిందని జడ్సన్ తెలిపారు.
నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్లో జరిగిన <<13627996>>కారు ప్రమాదంలో<<>> గాయపడిన బాలికల్లో ఒకరైన ఈశ్వరి (13) గురువారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించింది. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గురువారం, శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 11.5 నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు గురువారం ప్రారంభమై ఆగస్టు 7వరకు జరగనున్నాయి. కాగా జిల్లాలో 640 పోస్టులకు 7వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజామాబాద్లోని నాలెడ్జి పార్క్ స్కూల్లో 2,600 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందే రావాలని అధికారులు సూచించారు. >> ALL THE BEST
Sorry, no posts matched your criteria.