India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది.ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కామారెడ్డి పట్టణంలోని లింగాపూర్లో సద్దుల బతుకమ్మ రోజు కుటుంబ సభ్యుల్లోని మగవారు సాంప్రదాయ వస్త్రాలు ధరించి పెద్ద బతుకమ్మలను ఎత్తుకుంటారు. ఏటా ఇలాగే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు జరుపుకొంటారు. కేవలం మహిళలకే పరిమితం కాకుండా మగవారు కూడా బతుకమ్మ ఉత్సవాలు ముగిసే వరకు సమయం కేటాయిస్తారు.
లింగాకృతిలో బతుకమ్మను మహిళలు తయారు చేశారు. ఆ బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. కామారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డు విద్యుత్నగర్ కాలనీ, దేవుపల్లికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వైద్య ఉమారాణి థర్మాకోల్ ఉపయోగించి శివలింగాకృతిలో పూలతో బతుకమ్మ తయారుచేసి తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రకృతిపరంగా, ఆధ్యాత్మికపరంగా ఈ బతుకమ్మ ఎంతో శోభను కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శేఖ్ గౌస్ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే బయోసైన్స్లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయినా అధైర్యపడలేదు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని చూసుకున్నాడు. చివరికి ప్రభుత్వ కొలువు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీంతో మద్నూర్ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్గా నియమితులైన బీర్కూర్ మండలం దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డిని పలువురు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, పోగు పాండు, ఓంకార్, ఈరాజ్ సాయిలు, నర్ర సాయిలు, సమద్, సతీష్, పిర్గొండ సతీష్, రాజు, బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉన్నారు.
సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.
భీంగల్ పట్టణంలో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం భీంగల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ భీంగల్ పట్టణంలో నంది నగర్ వద్ద రోడ్డు దాటుతున్న తోపారపు నిశ్వంత్(7)ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
దసరా పండుగ సందర్భంగా తమ ఊర్లకు వెళ్లే వారికి NZB సీపీ కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంభందించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. తమ తమ గ్రామాలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.